పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/530

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వాదశాశ్వాసము

469


సక్తావనతచరణుండు నవలంబమానహస్తుండును నధోముఖుండును నగు నా భూతప్రముఖుం జూచి.

19


సీ.

తరువెక్కి కాళులతగు లూడ్చునంతలో
        జేతులు పట్టినం జేతు లూడ్చి
మఱియుఁ గాళ్ళం బట్టి మొఱవెట్టునాతని
        మెడమీఁద నిడుకొని పుడమి కుఱికి
బంటున కుచిత మౌ పనికిఁ బంపక భిక్షు
        కుండు పీనుఁగు మోవఁగోరి పనిచె
ననిదూఱఁగా బిశాచాగ్రేసరుఁడు మీఁది
        కెగసి యెప్పటియట్ల తగిలియుండె


ఆ.

భూవరుండు మోసపోయితి నని తాను
మీఁది కేగి వీఁపుమీఁదఁ బెట్టి
కొనుచు డిగ్గి యేమియును బల్క నోడుచుఁ
గదలివచ్చెఁ గార్యగౌరవమున.

20


క.

ఆయెడ బేతాళుఁడు జన
నాయకుఁ బరికించి వేఁడి నరవర భార
వ్యాయామము మఱచి సుఖో
పాయంబునఁ దెరువు జరుగునని కథఁ జెప్పెన్.

21


వజ్రముకుటుని కథ

వ.

అది యెట్లనిన.

22


ఆ.

అఖిలలోకవిదిత మైన కాశీపురం
బునఁ బతాపముకుటుఁ డనఁగ రాజు
కలడు వాని కిష్టకాంత సోమప్రభ
యనఁగఁ గలదు పేరు సార్థముగను.

23