పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/520

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశాశ్వాసము

459


వీరునియాలనై విధవనై యుండుట
        సముచితం బదిగాదు చాగనిమ్ము


ఆ.

తడయనేల యనుచుఁ దరుణి ప్రార్థించిన
మాఱు వలుకలేక మనుజవిభుఁడు
కొంత యనుమతింప నంతలోఁ దజ్జను
లాయితంబు చేసి రార్తు లగుచు.

153


చ.

ధృతి మతిఁ బొంగి రాజునకు దీవన లిచ్చి నిజాధినాథు మే
నితునుకలుం దదస్త్రములు నించి ఘృతప్లుతచందనేంధనా
న్విత మగు నగ్నికుండమున నింతి వెస న్నవనీతపుత్రికా
కృతిఁ బడి యంతలోనఁ గరఁగెన్ జనులందఱుఁ బ్రస్తుతింపఁగాన్.

154


వ.

తదనంతరంబ.

155


క.

వసుధేశుఁడు వెఱుఁ గందగ
వెస నరిగయు వాలు ద్రిండు విలసిల్లఁగ నా
కసమున డిగి యవ్వీరుఁడు
కసుగందక వచ్చి తొంటికైవడి నిలిచెన్.

156


ఉ.

ఒక్కఁడు నిట్లు వచ్చి వినయోక్తులు మున్నుగ మన్నుఱేనికిన్
మ్రొక్కి సురప్రసూనముల మోహనమౌ నొకదండ యిచ్చి నే
నక్కడ కేగి దానవుల నందఱఁ ద్రోలినఁ జూచి మెచ్చుగా
నిక్కుసుమస్రజంబు దివిజేంద్రుఁడు నా కొసఁగెం బ్రియంబునన్.

157


క.

క్రమమున నయ్యింద్రుఁడు నా
కమరపదం బొసఁగి నిజసభాంతరమున ని
త్యము నుండఁగవలయుఁ గుటుం
బముఁ దోడ్కొనిర మ్మటంచుఁ బనిచె న్మగుడన్.

158