పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/513

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

452

సింహాసన ద్వాత్రింశిక


ముదిమిచే సంధులు వదలకమున్న రో
        గంబున నొకకీడుఁ గాకమున్న


ఆ.

పుణ్య మార్జింపు డవసరంబునకు మొదల
గట్టియౌధనములు గూడఁబెట్టు టండ్రు
జీవ మెడలంగ సుకృత మార్జింపఁజనుట
నిల్లు గాలంగ నుయి ద్రవ్వనేగు టండ్రు.

120


క.

ఈవచనం బితరులకొఱ
కై వినిపింపంగవలయు నది నీకడ స్వా
భావిక మైనది గావున
నీ వెఱుఁగనియట్టి ధర్మనిరతులు గలవే.

121


క.

నావుడుఁ గడు మది నుత్సుకుఁ
డై విప్రులయిండ్లు గృతులు నర్థము వనముల్
బావులు నూతులుఁ జెఱువులు
దేవస్థానములు నిలిపెఁ దేఁకువకెక్కన్.

122


ఉ.

ఎక్కడ జూచినన్ సుకృత మెన్నిక కెక్కఁగఁ గీర్తిసంపద
ల్పెక్కువిధంబులన్ ధరణిఁ బెంపు వహింపఁగ నానరేశ్వరుం
డొక్కఁడె తీర్థసేవనసముత్సుకుఁడై పరివార మెల్ల న
ల్దిక్కులయందుఁ గొల్చి చనుదేరఁగ నర్మద కేగె సొంపుగన్.

123


చ.

కరితురగాదిసైన్యపరికల్పితమార్గనివేశుఁ డౌచు ద
వ్వరిగి యవంతినాథుఁడు నిరంతరవారివిహారశీలసుం
దరతరరాజహంససముదాయసమాహితశర్మదన్నిజ
స్మరణనివారితోన్మదభుజంగమదుర్మదఁ గాంచె నర్మదన్.

124


క.

కనుఁగొని కడుఁ బ్రియమున నె
మ్మనమునఁ బ్రణమిల్లి యచటి మాంధాతృపురం