పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/408

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాశ్వాసము

347


పరిఖేదము గల దది యె
వ్వరిమూలము చెప్పు మనిన వాఁ డనుమతుఁడై.

117


సీ.

ఏ మని చెప్పుదు నిటక్రింద హూణదే
        శాధీశుఁడైన మాయయ్య తీఱె
నాయెడరున వచ్చి దాయాదు లందఱు
        రాజ్యంబు చేకొని ప్రాభవమున
వెడలఁ దోపించినఁ గడుదుఃఖితుండనై
        యొక హితుం డైన సేవకుని గూడి
యేతెంచి యిచట నాజ్ఞాతులచేనైన
        యభిషంగ మోర్వంగ నలవి గాక


ఆ.

యొంటి నడవి నిట్టిమంటఁ జాఁ గడఁగితిఁ
బరిభవంబునొంది బ్రదుకుకంటె
నిదియ మేలు గాఁగ మది నిశ్చయించితి
ననిన నాతఁ డతిదయాళుడగుచు.

118


క.

పగవా రొ త్తినయప్పుడు
జగ మెఱుఁగం దెగుట మొండె సైరణ యొండెం
దగుఁ గాక మిగుల నొగులుచు
మగవాఁడై మగువపగిది మడియుట తగునే.

119


చ.

ఇటు విను చేటులేని బ్రతు కే నొనరించెద నీకు వైరిసం
కట మడఁగుం బదాతితురగద్విరదంబులు గల్గు నర్థము
క్కట మగు వీని గొమ్మని విధానము లేర్పడఁ జెప్పి చేతియా
ఖటికయు యోగడండమును గంథయు వానికి నిచ్చెఁ జెచ్చెరన్.

120


శా.

తత్సామర్థ్యమునం బదాతితురగస్తంబేరమౌఘంబు న
త్యుత్సేథంబగు సర్వముం గలిగినన్ హూణక్షితీశాత్మజుం