పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/403

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

342

సింహాసన ద్వాత్రింశిక


సిద్ధయోగీంద్రప్రసిద్ధచారిత్రుని
        గాలవంచకునిఁ ద్రికాలనాథుఁ
జూడలేమైతిమి చూడంగఁ గన్నులు
        గలిగియు నిచట నిష్ఫలములయ్యె
బ్రాలేయగిరిపొంతఁ బన్నగాటవి నాతఁ
        డున్నతతపమున నున్నవాఁడు


ఆ.

తెరువు లహికులాధీనదుస్తరము లనుచుఁ
బోవలేమైతిమని తలపోసికొనఁగ
విని మనంబున నతనిదర్శనము గోరి
రాజశేఖరుఁ డచట నారాత్రి గడపి.

93


క.

అరుణుం డుదయింపఁగ స
త్వరగతి నుత్తరము గదలి తఱచైనమహా
తరులును గిరులును దాఁటుచుఁ
దెరు వేడలక నడిచి కొన్నిదివసంబులకున్.

94


క.

దుర్వారశరభగండక
దర్వీకరసింహదంతిదంష్ట్రులనెల వై
శర్వాణిజనకుఁ డగు నా
పర్వతపతి పొంతఁ జేరె భయరహితుండై.

95


మ.

హిమవత్ప్రాంతము చేరి శీతలములౌ నీరంబులు న్సిద్ధసం
యమిసద్మంబులు దేవదారుమయదివ్యశ్రీకుటీరంబులున్
భ్రమరానందమరందబిందువిలసత్పద్మాకరశ్రేణులుం
గుముదప్రోజ్జ్వలకుంజకుంజరమహాకుంజంబులం జూచుచున్.

96


క.

చల్లనికొండ నయంబున
నల్లున కింపయినయట్టి యాభరణగణం