పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

288

సింహాసన ద్వాత్రింశిక


వ్యాలోలాలకమాలికానుకలనావ్యాలంబరోలంబలీ
లాలోలాంబుజచిహ్నితం గనియె మధ్యాహ్నంబునన్ జాహ్నవిన్.

121


వ.

కని యందు నిమజ్జనం బొనర్చి భస్మత్రిపుండ్రాదిశైవలక్షణలక్షితుండై సకలదేవతారాధ్యు విశ్వేశ్వర శీమన్మహాదేవుని సందర్శించి సాష్టాంగదండప్రణామంబు లాచరించి నిటలతటకరకమలపుటుండై నుతియించుచు.

122


శా.

వింటి న్సర్వపురాణము ల్దివిజు లేవెంట న్నినుం బోలలే
రంటం దీర్ఘవిలోకనాజపతపోయజ్ఞాదిపుణ్యంబు లొం
డొంటి న్మీఱఁగ భాగ్యవైభవము నేఁ డుప్పొంగ ముక్కంటి ని
న్గంటిన్ జన్మఫలంబు గంటి నిచటం గాశీశ విశ్వేశ్వరా!

123


మ.

నిను జూడం జనుదెంచు నప్పుట నెద న్నెక్కొన్న మార్గశ్రమం
బున విచ్ఛాయములైన భక్తుల పదాంభోజంబు లత్యంత న
మ్రనిలింపావళిమౌళిరత్నములచే రక్తాతిరక్తప్రభం
గనుపట్టున్ శివరాజ్యపట్ట మగుచుం గాశీపురాధీశ్వరా.

124


వ.

అని కొనియాడి కృతకృత్యుండై యందు మాసత్రయంబు గడపి పదంపడి ఫల్గునవర్థనంబును, జిహ్వాలోలంబును, దక్షిణమానసంబును, నుత్తరమానసంబును, బ్రహ్మసరోవరంబును మున్నుగాఁ గల స్థలంబులఁ బితృపిండప్రదానతర్పణపరుండై, పితృముక్తికారణంబు లగునీశానవిష్ణుకమలాసనకార్తికేయవహ్నిత్రయార్కరజనీగణేశ్వరాది దేవతాచతుర్దశపాదంబులను, నక్షయవటచ్ఛాయయు, జనార్దనహస్తంబును మొదలగు స్థలంబుల గల్పితపితృతర్పణుండై గదాధరునకుం ప్రణమిల్లి, యుగళగౌరికి మ్రొక్కి మగిడివచ్చుచో నొకమహావనంబున.

125


సీ.

కన్యకాధీనమై ఘనవైభవంబుతో
        మణిమయప్రాకారమహిమ గలిగి