పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/343

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

282

సింహాసన ద్వాత్రింశిక


గుంభిని పురి వెల్వడి యా
కుంభినిపతియఱుత దండ కొమరుగ వైచెన్.

85


వ.

ఇట్లేనుఁగు పువ్వులదండ మెడ వైచిన.

86


ఉ.

ఆద్రవిళేశుఁ డాత్మసతి యప్పురలక్ష్మియఁ బోలె మున్నుగా
భద్రగజంబు నెక్కి కవిపాఠకగాయకకీర్తనీయుడై
మద్రపురంబు సొచ్చెఁ దను మంత్రులు గొల్వ మహాసనస్థుఁడై
రుద్రసఖుండువోలె నతిరూఢికి నెక్కె నుదారసంపదన్.

87


మ.

రమణీచందనగీతవాద్యకుసుమస్రగ్వస్త్రభూషాదిభో
గములం గోరికి మూరిఁబోవ నతిసౌఖ్యం బందుచు న్మంత్రివ
ర్గము కార్యంబులు దీర్పఁ పౌరు లనురాగం బంది నందింప రా
జ్యము సేయంగ సహింపలేక బలిమి న్సామంతభూమీపతుల్.

88


ఉ.

ఎక్కడివాఁడొ వీఁడు మన మిందఱ ముండఁగఁ దేరకాఁడు దా
నిక్కడఁ జేరి మద్రపుర మేలెడి వీనికి రాజ్యమిం కిటం
డక్కిన హాని యౌ నని కడంగి తదుద్ధరణాభిలాషులై
యొక్కెడ దండు గూడుకొని యుక్కునఁ గోటకుఁ జుట్టుముట్టినన్.

89


ఆ.

అపుడు సంధిమాట లైన నాడింపక
దొరల నైనఁ బోరి కరుగుఁ డనక
ధరణివల్లభుండు తానైనఁ గదలక
యతివతోడ నెత్త మాడుచుండె.

90


వ.

అయ్యవసరంబున మంత్రులును దొరలును బరివారంబును వైరు లెత్తివచ్చి కోటమీఁద విడిసినప్పుడు నీ వూరకునికి రాజధర్మం బగునే మాకునైన సెల వాన తిమ్మనిన వినియు విననిభంగి నున్నఁ దత్కాంతారత్నంబు పాచికలు చేతంబట్టుకొని.

91