పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

182 సింహాసన ద్వాత్రింశిక

యనఁగ రత్నపుత్రికాకృతి రసికుల
చూపుగములకెల్లఁ దీపు లొసగు. 178

క. ఆకామినిఁ గనుగొని కమ
లాకరుఁడు ప్రమత్తచిత్తుఁడై కందర్పో
ద్రేకమునఁ జేరునెడ నా
లోకించి యొకఁడు వింతలుగ నిట్లనియెన్. 179

క. ఈనరమోహినిఁ బొందం
గానేఁగినరాత్రి వచ్చి ఘనదంష్ట్రుం డన్
దానవుఁడు చంపుఁగావున
హానింబడనేల లిరిగి యరుదె మ్మిటకున్. 180

ఉ. నావుడు నుల్కి భూమిసురనందనుఁడు న్నరమోహినీరతే
చ్ఛావికతాత్ముఁడై నిలిచి సత్యముగా జనులెల్లఁ జెప్పగాఁ
దా విని చోద్యమంది వసుధావరు వీడ్కొని యొయ్య నొయ్య వి
ద్యావినయాధ్యుఁడై తిరిగి తండ్రిఁ గనుంగొన వచ్చె నూరికిన్. 181

మ. అచటం దల్లికిఁ దండ్రికి న్వరుస సాష్టాంగంబుగా మ్రొక్కినం
బ్రచురప్రేమరసాకృతిం బ్రమదబాష్పస్యంధమండంబుగా
రచితాలింగనులై , కుమారక! సుధీరత్నంబవై వచ్చితే
సుచరిత్రా! యిది భాగ్య మంచు మదిలో సొంపొంది రాదంపతుల్. 182

శా. తద్యోగంబునఁ దండ్రి మిక్కిలియు నాత్మంబొంగి సద్వృత్తికిం
జోద్యం బంది యనంతరంబ ధరణీశుం గానఁగా నేఁగి నా
యుద్యోగంబున జాణ యయ్యె నని యేనూహించెదన్ వీనికిన్
విద్యాచాతురి గల్గు టీవు కరుణ న్వీక్షింపుమా నావుడున్. 183

మ. క్షితినాథుండు నిజాదరంబునఁ గృతాశీర్వాదుఁడౌ నప్పురో
హితపుత్రుండు సభాస్థలి న్బుధగణం బింపొందఁగాఁ దా నకం