పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 143

లనువొందఁ జండికాయతనంబు నాపురిఁ .
గట్టించి కాఁపులఁ బట్టు కొలిపి
నియుతసంఖ్యములుగ హయముల బంట్లను
నాఱునూఱేన్గుల నతని కిచ్చి
ఆ. రాజుఁ జేసి పిడప రాజుకట్నంబున
కనుచు మూడుకోటు లర్థ మొసఁగి
పటహపటునినాదభంగి దిక్కులఁ గీర్తి
పిచ్చలింప మగిడి వచ్చెఁ బురికి. 204

క. కావున నాతని సరిగా
నీ వీగతీ భూమి కీర్తి నెఱపిన నెక్కం
గావచ్చు నిట్టి వితరణ
మేవెరవున దొరకదేని నింటికిఁ జనుమా. 205

వ. అని పల్కుటయు. 206

క. ఉల్లంబున భోజమహీ
వల్లభుఁ డాశ్చర్య మంది వదనాబ్జమున
న్వెల్లఁదనము వాటిల్లఁగ
నల్లనఁ దాఁ దిరిగి చనియె నంతఃపురికిన్. 207

శా. చక్రీభూతకఠోరశార్ఙ్గనితతజ్యావల్లరీముక్తబా
ణక్రూరోగ్రసమానసంస్ఫురణకీర్ణజాలపుంభీభవ
చ్ఛక్రాస్రద్యుతిమాత్రనిర్థశితరక్షఃపక్షపాతద్విష
చ్చక్రాటోపతమఃప్రసారుని మహాచక్రీశపర్యంకునిన్. 208

శా. ఆలోలాలకజాలభృంగయుతవక్తాంభోరుహోజ్జృంభిత
ప్రాలేయాద్రితనూభవాకృతిమతిప్రాప్తాంధకచ్ఛేదనో