పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94 సింహాసన ద్వాత్రింశిక

బడి వడిఁ దూలివచ్చు శలభంబుతెఱంగున నోహటించి లో
పడక పురంబు సొచ్చి సుతపాలికి నాపద చెప్పి పుచ్చినన్. 140

మ. ఆది యాత్మప్రియుఁ జేరి, దేవ! మును ప్రహ్లాదుం గృపం గాచి యు
న్మదుఁ డౌ దైత్యునిఁ ద్రుంచి తీవు మొసలి న్మర్దించి యాయేన్గు నె
మ్మది రక్షించితి నేఁడు నీ న్గొలువగా మాతండ్రి కిట్లీ మహా
పద వచ్చెన్ రిపుసంఘముం దునిమి నీభక్తు న్భువి న్నిల్పవే. 141

క. వేడుకొనిన వాఁడును
మనమున నిటు దలఁచెఁ దొల్లి మగతనమునఁ బూ
నినపూనిక విడిచిన నిఁక
వినువారలుఁ జూచువారు వికవిక నగరే. 142

తే. నాఁటిసాహసమున నిట్టిబోటి గలిగె
నేఁటితెంపున కొకవేల్పు నిల్వఁబడఁడె
యనుచుఁ జక్రంబు గైకొని యంత్రగరుడి
నెక్కి సూత్రంబు గదలించి యెగసి వచ్చె. 143

వ. అట్టి వేళ నయ్యాదివిష్ణుండు. 144

ఉ. గౌళికుఁ డిీల్గెనేనియు జగంబు జనార్లనుఁ డీల్గె నంచు న
న్నాలము సేయుచుండుఁ దన యల్లుఁడ నే నని నమ్మియున్న భూ
పాలుఁడు చిక్కు భక్తిఁ దమప్రాణము లొప్పనసేయ నున్న మ
న్నీలతలంపులుం బొలియు నే నటు పోవకయుండఁ బాడియే. 145

క. అని చక్రము చేవెలుఁగఁగ
వినతాసుతు నెక్కి వచ్చి విథుఁ డొప్పె సువ
ర్ణనగంబుమీద సౌదా
మినితోఁ జెలువొందు నీలమేఘము పోలెన్. 146