పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర ధ మా శ్వా స ము

35


     హము మాడ్కిన్ వెలిఁ దూఁకి శాత్రావులు చీకాకొంద వర్తించి సై
     న్యములున్ దానును సర్వశూన్యముగ నంతంబొందె నవ్వేళలో. 141
     
కర్ణావతీదేవి తనకు సాయపడుమని హుమాయూను నర్ధించుట

చ॥ దురము భయంకరం బగుచు దుర్గము నిల్వదటంచుఁ దోఁచు ముం
    దర నవరత్నసంతతులు దాఁపిన తోరము రాజ్ఞి ఢిల్లీ భూ
    వరుకడ కంపె; గష్టములువచ్చిన యప్పుడు రాజపత్ను లీ
    కరణి నొనర్చి సాయమునుగాంచుట వాడుకయై తనర్చెడున్. 142
    
సీ॥ పరిసర గ్రామ సంవాసినులగు వెలం
              దులు వేయిమంది యాతోరము నొక
    కనకపుం బళ్ళెరంబున నుంచి పూవు ల
              క్షతలను బెట్టి పూజల నొనర్చి
    నడచుచు వెళ్ళి యందఱు ఢిల్లిఁ జేరిరి
              హుమయూను వంగదేశమున నుండె
    నటకేగి దర్శించి రతఁడు హర్షించి హ
              స్తమున రక్షాబంధనము నొనర్చి
              
గీ॥ "సారసదళాక్షు లార యీతోర మంది
    నపుడె కర్ణావతీదేవి కన్న నైతి
    నామె నాచెల్లె లుదయసిం గల్లుఁడయ్యె
    వారిసేమమె నాసేమమై రహించు.143
    
గీ॥ భువన వంద్యుండు సంగ్రామభూప మణికి
    ముందు మాతండ్రి కూర్చినకుందు దీఱ
    నతని దేవేరినిఁ గుమారు నాదరించి
    నామొగల్ వంశమును బావనం బొనర్తు.144
    
గీ॥ అఖిల నృపులకుఁ బాదుసాయనుట కన్న
    రాజపుత్ర మహాదేశరాజ మాత
    కన్న యనుటయె కడుగౌర వాస్పదంబు
    పయనమై వత్తు బహుదూరుపంచి పుత్తు.145