132
శ్రీ దేవీ భాగవతము
తే.గీ. ఇట్లు బ్రతికించి రురునకు నిచ్చె దూత | వెండియమ్మునిపుత్త్రుండు పెండిలికిని
శుభదినము సూచి శోభన శోభఁదనరె , నప్పుడాబాపని వినోద మడుగనేల.286
వ. అట్లా మునికుమారుండు ప్రమద్వరం బాణిగ్రహణంబు చేసికొని సుఖంబుండెం గావున
నుపాయంబుసఁ బ్రాణంబులు రక్షించుకొనవలయునని చెప్పి.287
క. ఏడంతస్తులుగల యొక మేడను గట్టించి దానిమీదను దానున్
దోడుగ మఱికొందఱునుం గూడి వసించుచును మిగుల గూఢస్థితుఁడై.288
క. మణిమంత్రధరుల నిజర క్షణమునకుం గాపువెట్టె సముచితగతి బ్రా
హ్మణులను జపముల నిడి గజ గణములతో మంత్రి పుత్త్రుఁ గాపుంచెఁ దగన్.289
తే.గీ. అలఁతి యీగకుఁ జొరరాని యట్లు లోని | మేడపై మిద్దెగది గత్తి మెట్లగద్దె
నీటెఁగమ్మి యకటకటా నిరుకుచోటఁ జాటుగాఁ గూరుచుండె భూజానియపుడు.290
తే.గీ. స్నానమచ్చట ముత్తరి సంధ్యలచట భక్ష్యభోజ్యాదులచ్చటఁ బానమచట
వంటలచ్చటఁ గథలను వింట యచట | గాఁగ భూపతి యతిరక్ష గలిగియుండె. 291
వ. ఇట్లు బహువిధంబుల రక్షితుండై పరీక్షన్నరేంద్రుండు దినంబులు లెక్కపెట్టుకొను
చుండ నొక్కనాడు ధనార్థియై కశ్వపుండను విప్రశ్రేష్ఠుండు తన గృహంబు వెడలి
మార్గంబున వచ్చుచుండ నంతకుమున్న విప్రశాపంబు యథార్థంబు సేయ నిశ్చయించి
తక్షకుండను సర్వశ్రేష్ఠుండు వృద్ధబ్రాహ్మణ రూపంబు దాల్చి యతిరయంబున నిజవాసంబు
విడచి చనుచు మధ్యేమార్గమున మంత్రవాదియగు కశ్యపుం జూచి యీ ఎవ్వండ
వతిత్వరితగతిం బోవుచున్నవాఁడ వేమి కార్యం బెక్కడికని యడిగిన విని కశ్యపుండు.292
క. తక్షకుడు గఱచువాడు ప రిక్షిర్భూవరుని దానిఁ బృధు మంత్రబల
ప్రక్షేపంబున మనుతు ని రాక్షేపణగా నటంచు నరిగెద ననినన్.293
క. నేనే తక్షకనాముఁడ | నేనే భూనేతఁ గఱప నేగెదఁ దరమౌ
నేనే గఱచినవారల | నేనేర్పున మనుతు నింటి కేగుము మరలన్.294
వ. అనిన బ్రాహ్మణుండు.295
క. పోరా పన్నగ నాతోఁ బోరా? నామంత్రశక్తి పోడిమి బ్రతుకున్
బో రాజు; నీవిషము చెడి పోరాదను శాస్త్రమొకటి పుట్టెనె యనినన్.296
వ. తక్షకుండు.297
క. వెఱ్ఱివికావో చూచెదఁ జుఱ్ఱున నేఁ బోయి కోఱ సుదలను విషముల్
బుఱ్ఱున నోడఁగ నిపు డీ| మఱ్ఱినిఁ గరచెదను దీని మనుతువె కడిమిన్.298