పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ స్కం ధ ము.

109

    ఘాంచితవీర్యు లట్లగుట నాఁదట గర్భముఁ దాల్తు నేను నే
    మంచు వచింతు దండ్రికి నయప్రణయ ప్రియ దారి చూపుమా.40

వ. అనిన పరాశరుండు.41

ఆ.వె. నన్నుగూడినందున న్గన్యకాత్వంబు | నీకు బోవదింక నీకు వలయు
    వరము గోరు మదియు సరగున నిచ్చెద ననిన సత్యవతియు ననుమతించి.42
 
క. తలిదండ్రులు కన్నెననుచు | దలప వలయు నిన్నుబోలు తనయుండును గా
   వలయును మేన సుగంధము | నిలపవలయు జవ్వనము గునియవలయుసుమీ.43

వ. అనిస సంతసించి పరాశరుండు.44

క. నారాయణు నంశంబున | ధీరుండగు కొడుకు బుట్టు తెఱవా నీకున్
   వేఱొకటి చింతసేయకు | మారయుమీ నీకుమారు ననఘమతినిగాన్.45

తే.గీ. కన్నె యేనాఁడు నెఱుగని కామ మొదవె | నాకు నీమీఁద నచ్చరనాతి గాంచి
   కోతిగా నెంచితిని మున్ను కుసుమశరుఁడు | నేడు నామీద దండెత్తె నిన్ను గూర్ప.46
 
క. నీకుం గలిగెడి కొమరుఁడు | లోకైకనుతుండు నిశ్చలుఁడుసుమ్మ సువి
   ఖ్యాతుఁడు వేదవిభాగ ని | రాకులుఁడు పురాణకర్తయగునో ముగుదా.47

క. ఆ నెలఁత నూరడించి య | నూనామోదమున యమున యుదకంబుల
   స్నానంబు సేసి చనియెన్ మౌనీంద్రుఁడు గర్భమపుడు మానిని కయ్యెన్.48
 
ఆ.వె. గర్భమైన యేఁడు గడియలలోననే | కొడుకుపుట్టె మన్మథుఁడొ యనంగ
   పుట్టినపుడె తల్లిమొగ మట్టె తాఁ గని ! యిట్టులనియెఁ దేనె లుట్టిపడగ.49

చ. తపమున కేసుఁ బోయెదను తల్లి సుఖంబుస నింద యుండుమీ
   కపటుఁడగాను నీకు నొక కార్యము గల్గిననన్ దలంపుమీ
   యపుడె బిరాన వచ్చెద నటంచుఁ జనెన్ దదనంతరంబ యా
   త్మపితృగృహంబు సేరె వనితామణి నిర్మల మానసంబుతోన్.50

ఆ.వె. ద్వీపమందుఁ బడుట ద్వైపాయనుండయ్యె | కృష్ణుకళను బుట్టి కృష్ణుఁడయ్యె
   నందువలనఁగాదె నతఁ డెల్లఁదీర్థముల్ | శీఘ్రమే చరించెఁ జేసెఁ దపము.51

క. ఈమాడ్కిని సత్యవతీ | భామామణికిని జనించి వ్యాసుండు కలి
   వ్యామోహితులం బ్రోవ ద | యామయుఁడై సంహితల సయంబుగఁ జేసెన్.52

క. భారతముఁ జేసి శిష్యుల | కారూఢిం గ్రమముదప్ప కధ్యయనము నిం
   పారఁగ జేయించెను సువి | శారదుడై శ్రుతివిభాగసరణిఁ దలిర్చెన్.53