ప్ర థ మా శ్వా స ము.
49
నపుడు మాళవవసుధాధినాథుండు
నుపచరింపుచు శంఖోణోర్వీశమౌళి
కా కన్నియకుఁ బెండ్లి యపుడె కావించె
లోకు లుత్సవము లాలోకించి పొగడ
పరిభవంబును బొందు పార్థివులెల్ల
కరకరి చింతించి కాతరబుద్ధి
దొమ్మిచేయఁ దలంచి దొడరి మాళవుఁడు
గ్రమ్మిన నిలువ శక్యంబు గా దనుచు
గాంభోజుపై నీర్ష్య కడు వెల్లివిరియ
సంభృతలజ్జ మించగ నేగి రంత1170
అల వధూవరు లాత్మ హర్షించి కొన్ని
నెల లుండి వెనుక నా నృపుఁ డరణంబు
నొసఁగి పంపించ వా రుల్లసిల్లుచును
పొసగిన తమతమ పురముల కేగి
సతతంబు రతితంత్రసౌఖ్యానుభూతి
నతులితానందంబు లందుచు నుండి
రటులఁ గొన్ని దినంబులై న శంఖణుఁడు
పటుతరనిజరాజ్యపాలన మఱచి
గణకుల మంత్రులఁ గనుఁగొన కాప్త
గణముల డిగనాడి కామభోగముల1180
పరవశుఁడై గురుబంధుహితో క్తి
నరుచిఁ జేయుచు నెప్పు డంతఃపురంబు
తరలక నెవరికి దరిశన మీక
తరుణిరతాసక్తిఁ దగిలియుండఁగను
గొన్ని దినంబులకును మీఱి యహితు