ఈ పుట ఆమోదించబడ్డది
షష్ఠాశ్వాసము
357
తనయుండు జనియించి తగ మూడునెలలు
ధనము వెచ్చంబయ్యె తడయుట వలనఁ
గావున నా యాత్ర కడువిళంబించె
పూవుబోణినిఁ గొని పోరాదు గాన 1200
సకలధర్మార్థరక్షణసేయుకర్త
వకలంకశీలుండ వగు నిన్నుఁ జేర
వచ్చితి నే మళ్ళి వచ్చునందాక
ఇచ్చట నీ బాల నీవు రక్షింప
వలయును రక్షణవ్రతము నీ దగుట
ఇల నీకె యుక్తమౌ నిదె నేను పోయి
వచ్చెద ననిన నవ్వసుధామరేంద్రు
మచ్చిక దయచేసి మహిత ధనంబు
లిచ్చి పంపించి యయ్యింతినిఁ బ్రేమ
హెచ్చుగఁ దనవీటి కెలమిఁ దోడ్కొనుచు 1210
హరియాజ్ఞ చేకొని యరిగి యందొక్క
వరమందిర మొసంగి వరుసగా నారు
నెలలకు గ్రాసంబు నిలిపి యయ్యింట
కలికి బయలు వెళ్లఁగా వద్దటంచు
నేమించి దృఢభక్తి నిష్ఠుఁడై దినము
స్వామికైంకర్యైకసక్తతనుండు
నంతటనావిప్రుఁడరిగియక్కాశి
సంతసంబునఁజేరి జన్వారిఁజూచి
మధురాప్రయాగాది మహితస్థలముల
మధుసూదను భజించి మరలి యాగయను 1220