పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షష్ఠాశ్వాసము

337


చెలిమిఁ జేకొనఁగల్గు క్షితిచక్రవర్తి
యగుచు నీవంశంబు నతిధన్యముగను
బొగ డొందగాఁ జేయు పుణ్యుఁ డీతండు
మది సంశయముమాని మన్నించుమనవు
డది విని సభ మంత్రు లభినుతి సేయ
జనపాలుఁ డా బాలు సమ్మదం బొప్ప
నెనరునఁగైకొని నెఱిఁ గౌఁగిలించి
శిరము వే మూర్కొని చెక్కులఁ బుణికి
కరుణ లాలింపుచుఁ గడు మున్ను వేటఁ 730
జనుటయు నం దొక్క జలజలోచనను
గనుఁగొని మోహించి గలయు వృత్తాంత
మంతయుఁ దలఁచి యం దా మంత్రులకును
వింతగా వివరించి వేగ నచ్చెలువ
రావించి మునులచే రాకొమరునకు

తొండమానాఖ్యుఁడగు నందిని కుమారునకు రాజ్యాభిషేకము

భావితసూత్రోక్తపరిపాటి నపుడె
జాతకర్మాదులౌ సత్క్రియల్ సల్పి
ఖ్యాతిగా తొండమా నను నాఖ్యఁ జేసి
చదివించి వేదముల్ సాదనల్ నేర్పి
చదురుగా వేంకటశైలంబుచెంతఁ 740
దనరంగ నొక రాజధాని నిర్మించి
తనయు నప్పురమునఁ దనరాజ్యమునకు
నభిషేకమొనరించి యభిమతసిద్ది
నుభయలోకశుభంబు లొనగూడునట్లు