పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షష్ఠాశ్వాసము

311


క్రతువులు తపము యోగంబులు సల్సి
బహుజన్మములయందుఁ బ్రాపింపరాని
మహిత పుణ్యఫలంబు మనుజు లందఱును
కలియుగంబునను వేంకటనగాధ్యక్షుఁ
గొలిచి శీఘ్రంబుగాఁ గోరికల్ జెంది
యమరులు యోగీంద్రు లందలేనట్టి
విమలపదం బొంది వెలయఁ జాలుదురు. 100
జగతిఁ గావున కలి సాధు వనంగ
పొగడొందెఁ గలియుగంబు ముకుందుకరుణ
నావేంకటేశ్వరుఁ డర్చావతార
భావితమూర్తిప్రభావంబు మెఱయ
సాక్షాద్భవించి యా స్వామిపుష్కరిణి
దక్షిణతటభూమిఁ దనరెడి నొక్క
ఘనవనస్పతిక్రిందఁ గమనీయకుంజ
మున రమాదేవితో మురియుచు నుండు

వసుండను నిషాదునికధ
అప్పు డందొక వసుండను నిషాదుండు
చొప్పడు తన పూర్వసుకృతంబుకతన 110
స్థిరభక్తి నద్దేవుఁ జేరి సేవించి
నిరతంబు చిత్రయ న్నెలతతోఁ గూడ
చేరికె నొక కొఱ్ఱచేను గావించి
ధీరుఁడై మృగములు దిననీక కాచి
ముదిరిన యెన్నులు మును దీసితీసి
యది పిండి యొనరించి యలరుతేనియలు
బోసి మర్దించి యా బోనంబు శ్రీని