ఈ పుట ఆమోదించబడ్డది
పంచమాశ్వాసము
305
పటుగీతి నారదపర్వతుల్ బొగడ
విస్తృతాగమముల వివిధసంయములు
స్వస్తివాచనములు సలుపుచు నడర
రాజవైఖరి నేగి రహి వేంకటాద్రి
రాజిల్లు నిజమందిరము ప్రవేశించి 1320
చింతామణీ చిత్రసింహాసనమున
కాంతామణులుఁ దాను గరిమఁ గూర్చుండి
విధిశంకరేంద్రాదివిబుధుల మునుల
నధికసన్మతిచేసి యనిచి భక్తులకు
కామితార్థములెల్ల కరుణ నిచ్చుచును
శ్రీమించి విహరించె శ్రీనివాసుండు,
ఈగతిం బద్మిని నిందిరావిభుఁడు
బాగుగాఁ బెండ్లాడు పావనకథను
నిజభ క్తిఁ జదివిన నెమ్మితో వినినఁ
బ్రజలకుఁ గల్యాణ భాగ్యసంపదలు 1330
పొదలు సామ్రాజ్యంబు భోగమోక్షములు
కుదురుగ లభియించు గోరిన ట్లెల్ల
అని విచిత్రార్ధసమర్ధనాకలిత
ఘనసర్గవిశ్రుతకవిముఖ్యు పేర
విపులానుభావభావితసంవిధాన
కపటనాటక జగత్కారణుపేర
భాసురాంగశ్రుతి భారతిభవ్య
లాసికాగీత విలాసునిపేర
తారకాంతక పితృద్వంద్వాన్వధీత
తారకమంత్రాభిధానునిపేర. 1340