పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థాశ్వాసము

245


అని మది నూహించి య వ్విప్రవరుఁడు
వనితచెంతకుఁ జేరి వలరాజుబారి
తగిలి యెంతయుఁ దారి తమకంబు మీఱి
వగలాడి యెవతె వెవ్వరిదాన వీవు
నిను జూచి మరులు చెందితి నిందువదన
పనిఁబూని దీవింతు బ్రాహ్మణో త్తముఁడ
తరుణీలలామ నీ దయకుఁ బాత్రుఁడను 1670
మరు కేళి నను గూడి మన్నింపఁగదవె
అనుటయు నా మతంగాంగన యులికి
వెనుకకు జని కొంత విను బాపనయ్య
వొద్దికి రా కందె యుండు దోసంబు
పెద్దకులము దాన పెక్కు లేమిటికి
మాలదానికి నీవు మరు లొందఁదగునె
సాలుమాలినవెఱ్ఱిబాపనవాఁడ
యెంతపాపము గట్టి యెంచినా విపుడు
చెంతకు రాక విచ్చేయు మింకనిన
మోహంబున నతండు ముదితను జూచి 1680
హా హా విధాత యీ యంగనామణిని
నిరుపమసౌందర్యనిధిగా సృజించి
మరియు నంత్యజఁజేసి మహిసురు లంట
రాదంచు ధర్మశాస్త్రంబులు గొన్ని
బోధించి చెఱిచెఁగా బుధుల వంచించి
యింత చక్కనిదాని నెనసి కూడినను
సంతతన్వర్గ మిచ్చట నబ్బుగాదె
దీనిఁ గూడనియట్టి దేహ మేమిటికి