పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థాశ్వాసము.

227


కలశోద్భవవసిష్ఠకణ్వాత్రిముఖులు
వరమునుల్ చనుదెంచి వరుస నుండునెడ
సురల కమ్మునులకున్ శుభగోష్ఠివేళ1230.
మును పూజ్యు లమరులో మునులో యటంచు
మొనసెఁ సంవాదంబు ము న్నింద్రుఁ డరసి
యిది నిర్ణయం బని యేర్పరింపంగ
మదిఁ దోఁచకునికి యో మౌనీంద్రులార
మన కేల వాదంబు మహి వసురాజు
తనరంగఁ దేర్చు ని ద్ధర్మసంశయము
పోద మా నరపాలుపొంతకు ననుచు
సాదరంబుగ మౌను లమరు లింద్రుండు
చనుదెంచి ధరణికిం జయ్యన నపుడె
జనపాలమణి యుండు సభఁ జేరుటయును1240.
అల వారి నరపాలుఁ డాశ్చర్య మొదవ
తిలకించి యమితభక్తిని వేచి సేమ
మరసి యర్ఘ్యము పాద్య మాచమనీయ
మరుదారఁగ నొసంగి యాసనంబు లిడి
తగ నర్చన లొనర్చి తదనుజ్ఞ వడసి
వగ మీఱఁ గూర్చుండి వారికి ననియె
సుదినాహమిది మిమ్ముఁ జూడఁగల్గుటను
మది నన్ను గరుణించి మన్నించఁ దలఁచి
దేవమునుల్ వచ్చితిరి నా గృహంబు
పావనం బయ్యె నా భాగ్య ముప్పొంగె1250.
నేమి నే సేయనయ్యెడి దానతిండు
నేమించి పనిగొన నే కింకరుండ