పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

111


అంతట నామౌనులందఱు నందు
వింతకోనలు చరుల్ వెస కందరములు
నరయుచు వింత లౌనట్టి మృగముల
హరియంచు భావింతు రం దొకచెంచు
తిలకించినన్ వాసుదేవుఁడే యంచు
దలఁచి కేల్మోడ్తు రత్తఱి దివ్యమైన
ఫులుగును గనుగొన్న పురుషోత్తముఁ డని
కొలుతు రే పందిగన్గొన్న వెన్నుఁ డని820.
మ్రొక్కుదు రీరీతి మొనసి దిగ్భ్రాంతి
జిక్కినటుల బుద్ధి చెదరఁ ద్రిమ్మరుచు
సాయంతనంబున స్వామిపుష్కరిణి
చాయకు దైవవశమున వచ్చుటయు
నాతమ్మిచూలియు నపుడె యచ్చటికి
నే తేరఁగా వార లీతెరం గెల్ల
విన్నవించ ముకుందు వెదకంగఁ దరమె

స్వామిదర్శనమునకై బ్రహ్మాదులచ్చటి పుణ్యతీర్థంబులం దపంబుసల్పుట.

యన్నగదారి ప్రత్యక్ష మై తానె
కరుణించుదనుక దుష్కరమైన తపము
చిరతరంబుగ నిందుఁ జేయుద మనుచు830
పరమేష్ఠి నిర్ణయింపఁగ వార లటుల
కరమొప్ప స్వామిపుష్కరిణి స్నానంబు
సలిపి తపించి యచ్చటి కల్పసరణి
వెలయ సంకల్పముల్ వేర్వేరఁ జేసి
కొందఱు శేషవైకుంఠతీర్థముల
కొందఱు తుంబురుకోన తీర్థముల