Jump to content

పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/422

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 381


క.

నేఁటికథ చిత్రతర మో
బోటీ వినవమ్మ మంత్రిపుంగవసుత య
ప్పాటిం దెలిపిన నాదొర
నాటినచింతాభరంబున న్మన మగలన్.

619


తే.

కొంతతడవుండి యందు నొక్కింతయేని
దెలియ నే యెక్కడిపరాకు పలుకుమనుచుఁ
గదళికాకాంత పైఁజేతి కమ్మవిరుల
చెండు వైచినఁ దత్సతీసరసిజాక్షి.

620


తే.

సొమ్మసిలినట్లు వ్రాలినఁ జూచి విక్ర
మార్కభూపాలవరుఁడు హాహానినాదుఁ
డగుచు విలపింపఁ జని వయస్యాజనంబు
శీతలక్రియ లొనరింప సేదఁడేఱె.

621


చ.

అదిగని పుష్పహాసుఁ డహహా యని నవ్వఁ బ్రసూనవర్షమ
భ్యుదయము గాఁగ నంతట విభుండు కనుంగొని తీవ్రతోపుఁడై
యదయుఁడ వింతెకాక యొకయప్పుడు నవ్వనివాఁడ విప్పుడీ
మదవతి పుష్పపాతమున మ్రాన్పడిన న్వడి నవ్వ నేటికిన్.

622


చ.

అనవిని యయ్యమాత్యుఁడు ధరాధిప మున్నొకయద్భుతంబు నేఁ
గనుఁగొనఁగంటిఁగాన బహుకాలము తద్వ్యథం గుంది యున్కి నే
పనులకు నవ్వకుండితి సభాస్థలి నే డొకయద్భుతంబుఁ జూ
చినకత నన్మనంబు వికసించిన నవ్వితిఁ జిత్తగింపుమా.

623


తే.

అధిప యీయమ్మవారు మర్యాదపోవ
విడిచి నగరెట్లు వెడలెనో వెడలివచ్చి