పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ

అదియుఁ దన్ను దాల్చునతఁడు శుద్ధుండైన, సర్వసంపదలు నొసంగు నట్లు
గాక యశుచి యగుచుఁ గైకొన నతనినే, సాగి బ్రతుకనీక సంహరించు.

339


వ.

ఆప్రసేనుండును నమ్మణి కంఠంబున ధరించి తురగారూఢుండై యటవికి మృగ
యావినోదార్ధియై చనిన.

340


క.

సింగంబొక్కటి తుంగా, భంగత్వరఁ బాఱుదెంచి పార్థివసుతునిన్
రంగత్తురంగమముతో, డం గీ టడఁగించి మణి తటాలునఁ గొనియెన్.

341


గీ.

నోటఁ గఱచుకొని మనోవేగమునఁ బోవ, నడుగుజాడ వట్టి యంటి దానిఁ
జంపి పుచ్చుకొనియె జాంబవంతుండు , దీప్యమానమైన దివ్యమణిని.

342


ఉ.

భల్లుకవల్లభుండు రవిభాస్వరమౌమణిఁ గొంచు నంధకా
రోల్లసదద్రిగహ్వరగృహోత్తమ మత్తఱిఁ జొచ్చి వేడ్క సం
ధిల్లఁగ నందు నాత్మసుతుని న్సుకుమారునిఁ జూచి వానికిన్
సల్లలితోరుఖేలనము సాగుటకై మణి వ్రేలఁగట్టినన్.

343


వ.

మణిసమాలోకనోత్సుకుండై బాలుండు క్రీడించుచుండె.

344


గీ .

హరికి మణిమీఁద స్పృహగల దడిగికొనుట, లాఘవంబని తఱి వేచి లాఁచియుండి
విపినమునకుఁ బ్రసేనుండు వేఁట పోవఁ, జంపి మణి హరియించె నాశార్ఙ్గధరుఁడు.

345


వ.

అని సమస్తయదులోకంబును మెల్లన గుజగుజలం బోవ లోకాపవాదంబు
వచ్చెనని భగవంతుండైన యచ్యుతుఁడు యదుసైన్యపరివృతుండై ప్రసేనుని
తురంగంబు వోయిన మార్గంబుఁ బట్టి చనిచని.

346


మ.

అనివార్యద్విపవైరినిష్ఠురచపేటాఘాతనిర్భిన్నసం
హసనప్రస్రవదన్రపంకిలదరణ్యాంతంబునం గూలి చ
చ్చినవాహంబు ప్రసేనునిం గని ప్రహర్షస్వాంతుఁడై దైత్యసూ
దనుఁ డాచందము దేల్చె నందఱికి నిందావాదము ల్మానఁగన్.

347


క.

హరిజాడ నేగి యాముం, దర కుప్యద్భలుకేంద్రనఖనిర్దళిత
ద్విరదారిఁ జూపి యందలి, పరిపాటిం దెలిపి ఋక్షపతి చనుత్రోవన్.

348


వ.

భల్లుకేంద్రునిజాడఁ బట్టి చనిచని ముందర నొక్కమహాశైలంబుఁ గాంచిత తత్త
టంబున సేనల నిల్పి తద్బిలంబు ప్రవేశించి.

349


ఉత్సాహ.

సింగమొకటి వెంటఁబడి ప్రసేను జంపి దాని ను
త్తుంగభజబలప్రభాసితుండు జాంబవంతుఁడు