ఇట్లు రామలక్ష్మణభరతశత్రుఘ్నులు జగంబులకు సుఖస్థితి సంపాదించి
దివంబునకుం జనిరి. భగవదంశసంభూతులగు వారియందు ననురాగంబుగల
కోసలజానపదులు తన్మనస్కులై తత్సాలోక్యంబు నొందిరి. రామునకుఁ
గుశలవులును, లక్ష్మణునకు నంగదచంద్రకేతులును, భరతునకుఁ దక్షపుష్క
రులును, శత్రుఘ్నునకు సుబాహుశూరసేనులును గలిగిరి. అందు కుశునకు న
తిథి, నతిథికి నిషధుండు, నిషధునకు నలుండు, నలునకు నభుండు, నభునకుఁ
బుండరీకుండు, పుండరీకునకు క్షేమధన్వుండు, క్షేమధన్వునకు దేవానీకుండు,
దేవానీకునకు నహీనగుండు, నహీనగునకు రురుండు, రురునకుఁ బారియాత్రుండు,
పారియాత్రునకు దేవళుండు, దేవళునకు వచ్చలుఁడు, వచ్చలునకు నుత్కుఁడును,
నుత్కునకుఁ దైలుండు, తైలునకు ఉక్తుండు, ఉక్తునకుఁ వజ్రనాభుండు, వజ్రనా
భునకు శంఖణుండు, శంఖణునకు ద్యుషితాశ్వుండు, ద్యుషితాశ్వునకు విశ్వస
హుండు, విశ్వసహునకు హిరణ్యనాభుండు గలిగె. అతండు జైమినిశిష్యుండైన
యాజ్ఞవల్క్యునివలన యోగం బభ్యసించి యోగీశ్వరుం డయ్యె. ఆహిరణ్యనా
భునకుఁ బుష్యుండు, పుష్యునకు ధ్రువసంధి, ధ్రువసంధికి సుదర్శనుండు, సుదర్శ
నునకు నగ్నివర్ణుండు, నగ్నివర్ణునకు శీఘ్రగుండు, శీఘ్రగునకు మరుండును గలిగె.
అతండు యోగీశ్వరుండై కలాపపురంబున నున్నవాఁడు. ఆగామియుగంబు
నందు సూర్యవంశవర్తకుండు కాఁగలఁడు, అమరునకుఁ బ్రశుశ్రుకుండు నాతనికి
సుసంధి నతనికి సమర్షణుండు నతనికి విశ్వభవుండు నతనికి బృహద్బలుండును
గలిగె. బృహద్బలుండు కదా భారతయుద్ధంబున నర్జనపుత్రుండైన యభిమన్యుని
చేత హతుండయ్యె. వీర లిక్ష్వాకువంశభూపాలకులముఖ్యులు. వీరలచరితం
బులు వినిన సర్వపాపక్షయం బగునని చెప్పి శ్రీపరాశరుండు మైత్రేయున కిట్లనియె.