పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నికి నదితి, యదితికి వివస్వంతుఁడు, వివస్వంతునకు మనువు, నామనువున కిక్ష్వా
కుండు, నృగుండు, ధృష్ట, శర్యాతి, నరిష్యంతప్రాంశు, నాభాగ, దిష్ట, కరూష,
పృషధ్రాఖ్యులు పదుగురుపుత్రులు పుట్టి రంత.

7


గీ.

మనువు మిత్రావరుణులకు మఘము చేసి, తనకుఁ దనయులు గావలెనని తలంప
హోతషపచారముననందు నుదయమయ్యెఁ, గన్య యొక్కతె యిల యనఁగా మునీంద్ర.

8


క.

ఆయిల మిత్రావరుణుల, యాయతకృప మగుడఁ బురుషుఁడై సుద్యుమ్న
స్ఫాయన్నామంబునఁ దగి, యాయెడ శాపమునఁ గన్య యయ్యె న్మగుడన్.

9


వ.

ఇట్లు సుద్యుమ్నుండు క్రమ్మఱం గాంతయై సోమపుత్రుండగు బుధుని
యాశ్రమసమీపమునం బరిభ్రమించుచుండ.

10


చ.

కుసుమశరాశుగప్రచయకుంఠితుఁడై శశిపుత్రుఁ డప్పు డ
బ్బిసరుహనేత్రపై మిగులఁ బ్రేమ వహించి రమించె నందు న
ప్పసముగ నేకతంబ శతపత్రవిలోచనఁ గాంచి భ్రాంతుఁడై
యసమశరార్తి నెట్టి బుధుఁడైఁనఁ జలింపక నిల్వనేర్చునే.

11


వ.

ఇట్లు రమించి బుధుం డిలయందుఁ బురూరవుం గనియె నంత

12


చ.

ఇలకుఁ బురూరవుండు జనియింప మహర్షులు యజ్ఞపూరుషుం
జలజదళాక్షు వేదమయుఁ జాలఁబ్రసన్నునిఁ జేసి యయ్యిలా
లలనకుఁ బుంస్త్వరూప మగు లా గొనరించి రనంతరంబ య
య్యలఘున కుద్భవించెఁ దనయత్రితయంబు నయంబు మీఱఁగన్.

13


వ.

ఇట్లు సుద్యుమ్నునకు నుత్కల, గయ, వినతులను మువ్వురు కొడుకులు
పుట్టిరి. సుద్యుమ్నుండు స్త్రీపూర్వుండు గాన రాజ్యభాగంబున కర్హుండు గాకున్నఁ
దండ్రి వసిష్ఠువచనంబున నతనికిం బ్రతిష్ఠానపురం బిచ్చిన నతండు తన
పుత్రుండైన పురూరవున కిచ్చె.

14


క.

మనుపుత్రుండగు పృషధృఁడు, తనగురువులగోవుఁ జంపి తా శూద్రుండై
జనగర్హితత్వమునఁ బడి చనియె, నెచటికేనియును విచారము గదురన్.

15


వ.

కరూషునివలన కారూషులను బలపరాక్రమసంపన్నులైన క్షత్రియులు కలి
గిరి. దిష్టునకు నాభాగుండు కలిగి వైశ్యుం డయ్యె. అతనికి బలంధనుండు నతనికి
వత్సప్రీతియు నతనికిఁ బ్రాంశువు నతనికిఁ బ్రజాపతియు నతినికి ఖనిత్రుఁడు నత
నికిఁ జాక్షుషుండు నతనికి వింశుఁడు నతినికి వివింశకుఁడు నతనికి ఖనినేత్రుఁడు
నతసికి నతివిభూతియు నతనికి గరందముండు నతనికి నవిక్షితుండు నతనికి
మహాబలుండైన మరుత్తుండు పుట్టె.

16