పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యిది యేమని విచారించు సౌవీరపతిం జూచి యమ్మహాబ్రాహ్మణుం డద్వై
తాంతర్గతంబైన యితిహాసంబు గలదు చెప్పెద వినుమని యిట్లని చెప్పం
దొడంగె.

246


గ.

ఋభు నామధేయుఁ డబ్జ, ప్రభవతనూభవుఁడు జ్ఞానభాసురుఁ డగ్ని
ప్రభుఁ డొకముని గలఁ డతనికి, నభినుతశిష్యుఁడు నిదాఘుఁ డనుముని వెలయున్.

247


వ.

పులస్త్యపుత్రుండైన యన్నిదాఘుండు ఋభునకుం బరిచర్య చేసి యతనివలన
నవాప్తజ్ఞానతత్త్వుం డయ్యును నద్వైతవాసన లేకయున్న గురుండు విచా
రించుచునుండె. అంతం గొంతకాలంబునకు నాశిష్యుండు దేవికానదీతీరంబున
రమ్యోపవనపర్యంతంబును సకలవస్తుసమృద్ధంబును పులస్త్యనివాసితం
బునునగు సగరాఖ్యపట్టణంబును నివాసంబు చేసె నంతి దివ్యవర్షసహస్రంబులు
చనిన.

248


సీ.

గురుఁడు శిష్యుని జూడగోరి యప్పురి కేగి, తద్గృహద్వారంబుదండ నిలువ
వైశ్వదేవము చేసి వచ్చి వాకిటనున్న, ఋభునిం గనుంగొని యభినుతించి
యన్నిదాఘుఁడు మ్రొక్కి యర్ఘ్యపాద్యము లిచ్చి, లోనికిఁ దెచ్చి యాసీనుఁ జేసి
యన్నంబు భుజియించుఁ డనుచుఁ బ్రార్థించిన, నాకు నెన్నఁడు కదన్నములుకూడ


గీ.

ననిన మాయింటఁ గలవు పాయసగుడోప, కలితమోదకసాజ్యముఖ్యంబులైన
భోజ్యములు పెక్కు నీచిత్తమునకు వచ్చు, వానిఁ గరుణించి భుజియింపవలయు ననిన

249


ఇవియన్నియును కదన్నము, లవహితమతి మృష్టమైన యన్నం బిడుమ
న్న వధూటిఁ జూచి యట్టిద, ధవళేక్షణ పెట్టుమని నిదాఘుఁడు పలికెన్

250


వ.

నిదాఘపత్నియు నట్ల శుచియై యలంకరించుకొని మృష్టాన్నంబు పెట్టిన యథే
చ్ఛంబుగా భుజియించి సుఖాసీనుడై యున్న యమ్ముని నవలోకించి ప్రశ్ర
యావనతుండై నిదాఘుం డిట్లనియె.

251


సీ.

మునినాథ తృప్తి యయ్యెనె తుష్టి గల్గెనే యాహారమున మనం బలరెనయ్య
యెచ్చోట నునికిప ట్టెచ్చోటి కరుగఁగాఁ దలఁచినా రిప్పు డెవ్వలననుండి
వచ్చితిరన్న నెవ్వనికి నాఁకలి గల దతని కన్నము దిన నగును దృప్తి
యాఁకలి నాకు లే దడుగనేటికిఁ దృప్తి దహనుచేఁ బార్థివధాతు వింక


గీ.

నాఁకలియు ధాతువు జలంబు నరిగిపోవ, దప్పియును బుట్టు మర్త్యబృందమున కెల్లఁ
దెలియ నాఁకలిదప్పులు దేహులకునె, యవియు రెండును నాకు లే వలఘుచరిత

252


వ.

క్షుధ పుట్టకుండుటం జేసి నిత్యంబు తృప్తియ మనస్స్వాస్థ్యంబు తుష్టి యనఁబరఁగు.
ఇవి చిత్తధర్మంబులు. పురుషుఁడు వీనిం బొరయండు. నివాసం బెచ్చట యెచ్చోటి