పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

క్షితిపతికి నిట్లు చేసిన, గతి నతిసౌఖ్యాన్వితములుగాఁ బరిజనసం
తతికి వినిర్మించె యతి సు, కృతి మజ్జనభోజనాదికృత్యము లెల్లన్.

134


క.

వెండియు నమ్మణిలోపల, నుండి జనించినయథావిధోచితసేవా
పాండిత్యంబులు గలిగిన కొండికప్రాయంబునరులు కోటులసంఖ్యుల్.

135


సీ.

కలిపి తెచ్చినజీవనలు జమ్ము పిప్పలదళములు భద్రశుండాలములకు
కవణంబు పసిడాలు గఱకి భోజనము సెనగలు గుడములు గంధర్వములకు
నింబప్రవాళభారంబులు కోమలకంటకాంకురములు గరభములకు
చక్కుగా నఱకినజాడుచొప్పలు నులువలపిష్టములు బలివర్ధములకు
పచ్చినంజుళ్ళు గమ్మనిపాలు గూడు, సారమేయంబులకుఁ గడుపారఁ బెట్టి
యెవ్వరికి నేమి వలె నవి యెల్ల నిడుచుఁ, నిఖిలజీవులఁ దృప్తిఁ బొందించిరంత.

136


చ.

మునికులచక్రవర్తికిఁ బ్రమోదముగా మణి చేయుచిత్రముల్
గనుఁగొని దానికిన్ సమముగామి యెఱింగినభంగి సిగ్గునం
దనమణిఁ బాఱవైచె నిది దప్పదు నాఁ బడియెన్ సరోజినీ
వనవిభవావలంబము దివాకరబింబము పశ్చిమాంబుధిన్.

137


క.

అకరువులమచ్చులగుది క, ర్ణికాసువర్ణంబు ముధుపనికషము గలత
మ్మికవిలసంచి దివసవై, శ్యకులాగ్రణి వాయి గట్టె సంధ్యావేళన్.

138


చ.

ఎడపనికూర్మితోడ రమియించి వృథా కలహించి పాసి పో
యెడుతఱిఁ గామినీకరగృహీతపటాంచలుఁ డైనభర్తకై
వడి మునుమాపుదాఁక మధువారి యథేష్టము గాఁగ నాని వె
ల్వడుచుఁ బెనంగెఁ దేఁటి ముకుళత్కమలగ్రసితాగ్రపక్షమై.

139


సీ.

దివసరాజునుఁ బ్రతీచి యిచ్చునివాళిదీపాంకురంబులదీప్తి వోలెఁ
గమలాప్తుహరులరింఖాముఖంబులఁ దూలుచరమాద్రిధాతురజంబు వోలె
నంబరలక్ష్మి నూరార్చి రమ్మనుచు భాస్కరుఁడు పంపినమయూఖములు వోలె
నర్కునిఁ దాఁకి పోరాడినమందేహదనుజులదేహరక్తంబు వోలెఁ
గలయఁ. బర్విన సాంధ్యరాగములు పారి, భద్రభద్రంబులై కానఁబడియె బంధు
జీవజీవంబులై వేడ్క సేయ హృదయ, హారిబింబానుబింబంబులై రహించె.

140


సీ.

అభ్రతాపింఛవన్యాఘోణి రోదసికాపాలికమషీవిలేపనంబు
దివసాబ్జముకుళనోద్ధితభృంగతతి వారుణీపరిప్రాప్తసూర్యాపకీర్తి
చక్రదాంపత్యవిషము రజన్యభిసారికాతమమేచకకంచుకంబు
కాలగోపాలకకంబళంబు రమాకుమారనాసీరధాటీఁరజంబు