పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

సైన్యములు డస్సె నపరాహ్నసమయ మయ్యె, నిందు నొకపూఁట నిలిచిన నేమి దప్పెఁ
జూత మీతాపసునివట్టియేతు లంచు, నృపతి విందారగింపంగ నియ్యకొనిన.

102


చ.

బలము లపారముల్ ధరణిభర్తయుఁ బర్యటనంబువంక నాఁ
కలిఁ గొనినాఁడు వేగిరమె కావలె భోజన మెట్లు గూడు నీ
కళవళ మింక నేల హరి కామితసంపద లిచ్చు భక్తవ
త్సలుఁడు గలండు నాకు నని సంయమిరాజు తదర్చనార్థమై.

103


ఉ.

గంగకు మందగంధవహకల్పితనర్తనతారతారతా
రాంగకు గర్భపూర్ణమకరందహిరణ్మయసారసారసా
రంగకు బాలసైకతనిరంతరఖేలనచక్రచక్రచ
క్రాంగకుఁ బోయి శ్రీహరి దయానిధిఁ గీర్తన చేసె నచ్చటన్.

104


క.

అని చెప్పిన విని యేవిధ, మునఁ గీర్తన చేసి గౌరముఖమౌని జనా
ర్దను నానతి యిమ్మన ని, ట్లని పలికె వరాహదేవుఁ డవనీసతికిన్.

105


మ.

జలరూపాయ చరాచరాత్మకజగత్సంస్థాయ లక్ష్మీమహీ
లలనేశాయ కరాళకాళీయఫణాలాస్యాయ దేవోత్తమా
య లయోత్పత్తివివర్జితాయ సుజనాయత్తాంతరంగాయ కే
వలకారుణ్యకటాక్షవీక్షణపరీవాహాయ తుభ్యం నమః.

106


వ.

వెండియు నోంకారంబు నీవ భూర్భువస్వరాదిలోకంబులు నీవ విశ్వప్రపంచంబు
నీవ నీవలన ఋగ్యజుస్సామాధర్వణంబులు స్మృతులు శాస్త్రంబులు వృక్షంబు లో
పధిపశుపక్షిమృగకీటకప్రముఖంబులు జన్మించె నిట్టినీమహత్త్వంబు దెలియ నశ
క్యంబు దేవా యిప్పుడు మదీయాశ్రమంబునకు దుర్జయుం డనునృపాలుం డపార
చతురంగంబులతోడ నభ్యాగతుండై చనుదెంచె నారాజునకు నాతిథ్యంబు సేయు
సామర్థ్యంబు లేదు తృణగుల్మప్రముఖంబు లైనవానిలోన నెట్టిది ముట్టిన నది చతు
ర్విధాన్నంబులుగా మానసమున నే నెద్ది గావలె నని తలంచిన నదియు నయ్యెడు
నట్లుగా ననుగ్రహింపు మని సంస్తుతిపూర్వకంబుగాఁ దనమనోరథం బెఱిఁగించిన.

107


క.

శతకోటిదహనవిధురవి, శతకోటిప్రభల గెలువఁ జాలినపరమ
ద్యుతి పరిఢవింప లక్ష్మీ, పతి కరుణారసపయోధి ప్రత్యక్షంబై.

108


మ.

అనవద్యవ్రతశీల నీకు నిది యిష్టావాప్తి గావించుఁ బ్రా
ర్థనమాత్రంబున నింద మంచు నొకరత్నం బిచ్చి నీరేజలో
చనుఁ డంతర్హితుఁ డయ్యె గౌరముఖుఁడున్ సంతోషనిర్మగ్నుఁడై
చనుదెంచెం దనపర్ణశాలకు హవిస్సౌరభ్యధారాళకున్.

109