పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గంధగజనగంబులు వ్రక్కలు గాఁగ నక్కుమారకంఠీరవునారాచంబు లనుకుఠా
మరప్రసూనగుచ్ఛంబులతోడ హిరణ్మయఘంటికాఫలంబులతోడ నంఘ్రిమూలం
బులతోడ హయానోకహంబులు విటతాటనంబులు గాఁగ నవ్వీరవరుని శిలీముఖం
రంబులు కఠోరంబులై తాఁకినఁ గర్ణపల్లవంబులతోడ గాత్రవిడంబమానధవళచా
బు లనుజంఝానిలంబు విసరినం గూబరస్తంభంబులతోడ సితాతపత్రశిరోగృహం
బులతోడ రథికసారథిసాలభంజిలకతోడ నవరత్నప్రభావిచిత్రవర్ణంబులతోడ నుత్తా
లకేతనపటపల్లవపారావతంబులతోడ శతాంగసౌధంబులు భగ్నంబులు గాఁగ నవ్వా
రణాసివల్లభుభల్లంబు లనుసంవర్తమార్తాండబింబంబులు వేఁడి చూపినం గరవాల
మీనంబులతోడ వర్తులఖేటకమఠంబులతోడ భుజాభుజగంబులతోడ దుకూలడిండీర
ఖండంబులతోడ బిరుదమేచకచమరవాలశైవాలంబులతోడ సింహనాదకల్లోల
కోలాహలంబులతోడ భటసముద్రంబులు శుష్కీభూతంబులు గాఁగ విలోకించి
రౌద్రంబున మిగుల నుద్రేకించి సునాశీరుండు సుధాంధసులు సూరెలం గొలువ
సుప్రతీకసూనుం దాఁకి సునిశితాస్త్రంబుల స్రుక్కించిన నతండు నడుము ద్రొ
క్కినమహానాగంబులాగునఁ గ్రోధనిశ్వాసఫూత్కారంబులు నిగుడ విషదిగ్ధమా
రణదంష్ట్రాంకురంబుల నొప్పింప మూర్ఛిల్లుటయు నుల్లంబులు దల్లడిల్ల వైమానికసైని
కులు పెల్లగిలినం గనుంగొని దిశానాయకుల: రోదసీకటాహంబు మిగుల నార్చి
యెదిర్చిన.

52


గీ.

నృపతి వేయేసిబాణంబు లేసె నేయ, గాయముల నాదిగీశులు గానఁబడిరి
తోడివారలు గాన నింద్రుండువలెనె, తారు వేయేసికన్నులు దాల్చి రనగ.

53


క.

ఆవేళ మూర్ఛ దేఱి శ, చీవనితావిభుఁడు రాజసింహముపై నై
రావణకరి నెక్కి ధరి, త్రీవలయము సంచలింప దీకొలుపుటయున్.

54


క.

బలువిడి నది ఘీంకారం, బులు సేయుచు వచ్చి కవియ భూపతి తాటా
కులచప్పుళ్ళకు దయ్యం, బులు వెఱచునె వత్తుగాక పొలియఁగ ననుచున్.

55


గీ.

కరటిపై నేసె నొకవాఁడిశరముఁ గ్రౌంచ, నగముపై నేయునాఁటిసేనానివోలె
దాన నొచ్చియు నిలువ హస్తమున నమ్మ, హాగజేంద్రంబుకుంభంబు లప్పళించి.

56


సీ.

సింగిణివిల్లు శచీనాథుఁ డెత్తినఁ దునిమె భల్లంబున దుర్జయుండు
జిష్ణుండు శక్తి వైచినఁ గృపాణమున సుద్యుమాగ్రజన్ముండు దుమురు చేసె
కుంతంబు సురరాజు గొన్నఁ జక్రమున విభాళించె విద్యుత్ప్రభాసుతుండు
నముచిమర్దనుఁడు శూలము ప్రయోగించినఁ జదిపె ముద్గరమున సౌప్రతీకి
పవికి నింద్రుండు చేసాచునవసరమునఁ, గాశికాభర్త హస్తలాఘవము మెఱయ
నతనిఫాలానఁ గ్రుచ్చె భాగ్యాక్షరములు, తుడువు మనిపంచెనన వాఁడితోమరంబు.

57