పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నవమిం గాని చతుర్దశిఁ గాని కృతోపవాసుండై పఠియించి నృపాలుండు సంవత్సరం
బులోపల లబ్ధరాజ్యుం డగు నేతదుపాఖ్యానంబు వినినవారికి సకలకామితంబులు
ఫలియించు నది వ్రాసినపుస్తకంబు పూజించువారిగృహంబున ధనకనకవస్తువా
హనసమృద్ధియుం బుత్రపౌత్రాభివృద్ధియుం గలుగు నగ్నిచోరాదిబాధలు లే వని
వారాహదేవుండు చెప్పిన విని ధరిత్రీహరిణనేత్ర తరువాతివృత్తాంతం బానతిమ్మని
విన్నవించిన.

135


మ.

భవదీయోరుభుజావినిర్మితమహాభారవ్యపాయోచితో
ద్భవనిశ్వాసవితర్కదాయకగృహోద్యద్వాత గోత్రాదిమ
స్తవినిక్షిప్తసమస్తదిఙ్ముఖజయస్తంభౌఘ తుళ్వాన్వవా
యవతంసా పరిషద్రిరంసకవిసంఖ్యావత్ప్రియంభావుకా.

136


క.

ధరణినుతదేవకీపుర, వరనిలయశ్రీగిరీశవరసంపన్నే
శ్వరవిభుతనయా సాళువ, నరసింహనృపాలదండనాయకతిలకా.

137


శిఖరిణి.

వరాసేవాహేవాకిజనధరణీవాసవగవీ
కరాలోకాలోకాగ్రవిధుమణి రాకాశశియశో
భరా చాపాటోపార్జితబహుయశోపాయనపరం
పరా రంభాపుంభావసుఖరిపుసంభారవినుతా.

138

గద్యము. ఇది శ్రీమదుమామహేశ్వరప్రసాదలబ్ధసారసారస్వతాభినంది
నంది సింగయామాత్యపుత్ర మల్లమనీషిమల్ల మలయమారుతాభి
ధాన ఘంట నాగయప్రధానతనయ సింగయకవిపుంగవ
ప్రణీతం బైనశ్రీవరాహపురాణం బనుమహా
ప్రబంధంబులం దేకాదశాశ్వాసము.