పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నర్కుటము.

రహీ గలరుద్రకన్యకలరాగములన్ వినుచున్
సహసితలీల భృంగిరిటనాట్యములం గనుచున్
ద్రుహిణకపాలపాలికలు గ్రుచ్చినగద్దియపై
మహిమ సుపర్వకోటినడుమం గొలువై నిలువన్.

6


క.

త్రసరేణుసమానవిమా, నసమారూఢుఁ డయి వచ్చి నగధన్వికి మ్రొ
క్కి సనత్కుమారుఁ డజుమా, నసపుత్త్రుఁడు నిలిచె నపుడు నామదిలోనన్.

7


శా.

మాహాత్మ్యంబులు తేజముల్ విభవసంపత్తుల్ విమర్శింపఁగా
నోహో భేదము లేదు నిండుసభలో నొక్కింతమాత్రంబు హే
మాహేమీలు ఘటాఘటీ లతిరథుల్ మాంధాళు లీసాము లే
లా హీనాధికభావముల్ తడవ రా దంచున్ వితాకుండనై.

8


క.

రుద్రుండు భక్తలోకమ, రుద్రుం డీయర్థమునకుఁ బ్రోఁ గేర్పఱుపన్
భద్రం బగు నా కనుచున్, దద్రాజకళాశిరోవతంసముతోడన్.

9


మత్తకోకిల.

ఉగ్ర శంకర భక్తవత్సల సోమ యీమఖసీమలో
నగ్రపూజ లొనర్తు నెవ్వని కానతి మ్మని పల్క సా
నుగ్రహంబున నాసుమేరుధనుర్ధరుండు సమస్తదే
వాగ్రగణ్యులు వింజ మా కిడినట్లు నిల్వ ననున్ ననున్.

10


సీ.

ఈచరాచర మెల్ల నేదేవదేవునివలన మాటికిఁ బుట్టు నిలుచు నడఁగు
తెలిసి యేదేవు నుద్దేశించి పెద్దలు గావింతురు మహామఖంబు లెపుడు
నేదేవుపాదనఖేందుచంద్రిక సుమ స్తబకంబు శ్రుతివధూకబరికలకు
నద్వంద్వుఁ డయ్యు లీలార్థంబు గాఁగ నేదేవుండు దాల్చె మూర్తిత్రయంబు
సత్వరజములతోఁ గూడి స్రష్టయై ర, జస్తమంబులఁ గూడి మత్సంజ్ఞుఁడై వి
శుద్ధసత్త్వసమృద్ధి విష్ణుఁ డయి నుతులు, గాంచు నేదేవుఁ డతనిఁ బూజించు మునుపు.

11


వ.

కుంభసంభవా మఱియు నొక్కరహస్యంబు వినుము సకలయజ్ఞఫలప్రదానపరా
యణు నారాయణుం గృతయుగంబువారు శుద్ధసూక్ష్మస్వరూపుం డని భావింతురు
త్రేతాయుగంబువారు యజ్ఞమూర్తి యని యజింపుదురు ద్వాపరంబువారు పాంచ
రాత్రమతంబున భజియింపుదురు కలియుగంబువారు మత్కృతశాస్త్రమార్గంబులం
గొలుతురు పరంజ్యోతి యగు జనార్దనునకు నాకు నాకుశేశయాసనునకు భేదం
బాపాదించునసత్యవాదులు పాపలతలకుం బాదు లగుచు నరకంబునకుం బోదురు
వైదికంబు గానిభేదవాదంబు కలియుగంబునం బ్రబలం బగు నత్తెఱం గెఱింగిం చెద
మున్ను భూలోకవాసులు వేదోక్తయజ్ఞాదికృత్యంబుల వాసుదేవు నుపాసించిన