పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

కావున నీమహానుభావంబులు వారిజాసనాదులకు వాఙ్మానసగోచరంబులు గావు
మావంటివారికి గోచరించుట యెట్లు భవన్నామస్మరణైకశరణ్యుండ నైననన్ను
ధన్యుంగా ననుగ్రహింపు మని విన్నవించినఁ బ్రసన్నుండై సకలప్రపంచసంచరిష్ణుం
డు విష్ణుండు ఘనాఘనస్తనితగంభీరస్వరంబున వరంబు వేఁడు మనిన.

114


క.

పూజ్యం బైనభవత్సా, యుజ్యము కృప సేయు నాకు నుద్భటరథినీ
రజ్యత్పరమారణమం, త్రజ్యాటంకారశార్ఙ్గధనురుగ్రకరా.

115


గీ.

అనిన విని దేవుఁ డిట్లన నవధరించె, నలినభవునిదినావసానంబుదాఁక
నిలుము తరువాత నాతనివలన మహిమ, నెగడ జన్మింపఁగలవు జన్మించి పిదప.

116


క.

నారము పానీయమునకుఁ బే, రానారంబు నీవు పితృగణములకుం
వారక యిచ్చుకతంబున నారదనామంబు నీకు నలువ ఘటించున్.

117


సీ.

ఆజన్మమున భూసురాన్వయతిలక సాయుజ్య మిచ్చెద నంచు నురగశాయి
చనినఁ దపఃక్రియాసంసక్తిఁ గొంతకాలంబు వర్తించి దేహంబు విడిచి
కలిసితి బ్రహ్మనిగ్రహమున నంత నానలువ దినావసానమున లేచి
మానసపుత్రులలో నన్నుఁ బుట్టించె నాదిన ప్రారంభ మాది సకల
భూతసృష్టికి నిది నాపురాతనోద్భ, వప్రకారంబు నాకు రేవత్వసిద్ధి
గలిగె హరిఁ గొల్వ నీవును గొలువుమీ నృ, పాల శ్రీహరి దురితశుండాలహరిని.

118


చ.

అని పరమేష్ఠిసూనుఁడు ప్రియవ్రతరాజవరేణ్యుతోడఁ జె
ప్పినకథ కోలభర్త వినిపించిన భూరమణీలలామ యి
ట్లనియెఁ బురాతనుండు పరమాత్ముఁడు సర్వగుఁ డబ్జనాభుఁ డే
యనువున భావనీయుఁ డగు నత్తెఱఁ గెల్ల నెఱుంగఁ జెప్పుమా.

119


వ.

అనవుడు నవ్వరాహదేవుండు ధరావరారోహ నాలోకించి.

120


గీ.

మీనకమఠకోలమానవమృగకుబ్జ, జామదగ్న్యరామకామపాల
కృష్ణకల్కు లనుచు నెన్ను నీ పదిరాజ, సావతారములు రమాధిపతికి.

121


క.

పాపాబ్దిఁ గడచువారికిఁ, దేపలు వైకుంఠరమణదివ్యాకృతివీ
క్షాపేక్ష నడచువారికిఁ, దాపలు ధరణీ దశావతారములె సుమీ.

122


క.

తమదృష్టికిఁ బరమము నా, ద్యము భవ్యము నవ్యయంబు నైనతదాకా
రము గాన రామి నెప్పుడు, నమరులు సేవింతు రర్చనాదుల మూర్తుల్.

123


వ.

మఱియు రజస్తమోగుణప్రధానంబులు సమస్తలోకస్థితిపాలనాధీనంబులు వసుమతీ
వారివహ్నివాయువలాహకవర్త్మవాసరాధిపవనజవైరిక్షేత్రజ్ఞాభిధానంబులు నైన