పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అని వీడుకొలుప నబ్జా, సనుశాసనమున నగాగ్రసరుఁ డింటికి వ
చ్చి నిజపురము శృంగారిం, చి నిరాఘాటప్రమోదచిత్తముతోడన్.

36


సీ.

స్వస్తి సమస్తభవ్యగుణసంపన్నుఁ డైనతుషారపర్వతనాయకుండు
స్వస్తి సమస్తదివ్యగుణసంపన్ను లైననిషధవింధ్యమందరసుమేరు
దర్గురగంధమాదనమాల్యవత్పారియాత్రలోకాలోకచిత్రకూట
మలయప్రముఖబాంధవులకు సంప్రీతిఁ బుత్తెంచినశుభలేఖ దేవదేవుఁ
డైన శివునకు మనగౌరి నాదిశక్తి, నిచ్చుచున్నాఁడ మీరలు వచ్చునది వి
వాహమున కంచు లేఖలు వ్రాసి పంప, వారు నాకారములు దాల్చి వచ్చి రపుడు.

37


క.

వేగవతీయమునాగం, గాగోదావరులు మొదలుగాఁ గలనదులున్
సాగరములు భూరుహలతి, కాగుల్మము లవయవములు గైకొని వచ్చెన్.

38


వ.

ఇట్లు వచ్చినచుట్టంబుల యథోచితప్రకారంబుల గారవించి మంచుగుబ్బలి రాచ
వారు తనకు సహాయులై విహరింప బ్రహ్మాండంబు చవికెగా నక్షత్రపథంబు
ముత్యాలమేలుకట్టుగా మేదిని వేదిగా దిగంతశుండాలంబులు పూజెకుండలుగా నవ
ద్వయద్వీపంబులు జాజాలపాళికలుగా జలనిధానంబులు కలశంబులుగా దివా
కరులు దివియలుగా సుధాంశుండు గడియారంబుగా మేఘంబులు వాద్యంబులుగా
వివాహంబు సేయ నాయత్తపడి పెండ్లికొడుకుఁ బిలువం బంచిన మందరం బమంద
రయంబునఁ గైలాసఁబునకుం జని కింకుర్వాణసర్వసుపర్వు శర్వుం శని సాష్టాంగ
దండప్రణామంబు గావించి దేవా వైవాహికముహూర్తం బాసన్నం బయ్యె విచ్చే
యు మని విన్నవించిన నన్నీలకంధరుండు నిజవివాహవృత్తాంతంబు నీరజాసను
వలన మున్న విని సమ్మతించినవాఁడు గావున గమనోన్ముఖుండై.

39


సీ.

రింగులు వాఱ గైరికపుగింటెంపుఁబచ్చడము గటిప్రదేశమునఁ గట్టి
పాటలరుచుల సౌభాగ్యంబు చూపురత్నవిభూషణములు గర్ణములఁ దాల్చి
ధవళతరచ్ఛాయ నవకంబు లైనపచ్చసరాలు విపులవక్షమున వైచి
కపిలజటావల్లికలలోన పెక్కుదోయములక్రొవ్విరులమాల్యములు ముడిచి
ఫాలఫలకాగ్రమున శరత్కాలచంద్ర, కాంతి మించుననంగరక్షాతిలకము
తీర్చి పావనధర్మంబుతేజి నెక్కి, వనరుహభవాదిగీర్వాణవరులు గొలువ.

40


గీ.

రాజరాజసఖుఁడు రాజసంబున శైల, రాజరాజధాని రాజమండ
లావరోధిరత్నహర్మ్యస్థలబహువి, ధానిగుప్తనవనిధానిఁ జొచ్చి.

41


క.

నిక్వాణంబులఁ జరణపృ, దాక్వంగదభూష లడర ధరవల్లభసౌ
ధక్వంగణభాగంబున, శాక్వరపతి డిగ్గి సురలు సాహో యనఁగన్.

42