పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

69


వైనఁ గానిండు మున్నొక్క యక్షవరుఁడు
కంబుఁ డనువాఁ డొకానొకకారణమున.

61


ఉ.

మైంధవ నామధేయనృపమన్మథుగర్భమునన్ జనించి సౌ
గంధికబంధువంశకలికామధుమాసవిలాసియై సుధా
సింధుసబందుబంధురవశీకృతకీర్తిధునీప్రపూర్తియై
సింధుఁడు నాఁగ రాజకులశేఖరుఁ డౌ సుతుఁ గాంచె నెంతయున్.

62


క.

ఆరాజకులోత్తంసకు
మారిక యై యిది జనించి మహనీయకళా
శ్రీరంజిత యగుఁ బొండన
వారిజలోచనలు కొంత వగ దిరుగుటయున్.

63


ఉ.

రామలు కేలికాననధరాస్థలికిన్ మును క్రీడ సల్ప రా
రో మనసారఁ గమ్మనివిరుల్ దమనేర్పులఁ గోసికొంచుఁ బో
రో మదవృత్తి నీగతి మరుల్గొని పోరిన వారిఁ గానమొం
డే మనువారమమ్మ తరలేక్షణ వ్రాతఫలం బిటుండఁగన్.

64


క.

అని పలికి యమ్మునిపతికిఁ
బ్రణామములఁ దగ నొనర్చి రాజీవముఖుల్
చని రిట లతావధూటియుఁ
బ్రణుతయశః కంధిసింధుపతి కుదయించెన్.

65


సీ.

ఆ సింధుపతి యేలు నవనిమండల మిది
                       యతని పట్టణభర్మహర్మ్యవీథి
నభ్రంకషంబులై యాడెడుఁ గేతన
                       పల్లవంబులు చూడు మల్ల యవిగొ
చేరువ కిపుడు వచ్చిన కాంతిమతియను
                       తలిరాకుబోఁడి యీసులలితాంగి
యాపువ్వుఁదోట యీయిందీవరేక్షణ
                       క్రీడసల్పెడు నట్టి కేలివనము