Jump to content

పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

21


గీ.

కఱకుఁజూపుల మూడవక న్ననంగ
రత్నములు గీలుకొల్పిన రావిరేక
ఫాలభాగంబునను గ్రాల బాలుఁ డపుడు
శంబరారాతి యయాతిచంద మయ్యె.

6


మ.

వనితానేత్రచకోరచంద్రిక తనుస్వచ్ఛందకాంతిచ్ఛటా
ఖని యుత్సాహకళాఖళూరి మతిరేఖామంత్రసంసిద్ధి భో
గనివాసంబు లతాంతసాయకభుజాగర్వావలంబంబు యౌ
వన మమ్మానవనాథపుత్త్రునకు మవ్వం బొప్ప నేతెంచినన్.

7


సీ.

ధర మొక్క మైఁదాల్పఁ దరముకాదని భోగి
                       వరుఁడు దాల్చిన తనుద్వయ మనంగ
హృదయగేహముఁ బాసి యీశుఁ డేగఁకయుండ
                       నలవరించిన బోరు దలు పనంగ
సముదీర్ఘలావణ్యజలధిలోఁ జూపట్టు
                       లాలితశైవాలలత యనంగ
నిందిర విహరింప నెడముగా నజుఁడు గా
                       వించిన క్రొందమ్మివిరు లనంగ


గీ.

నిడుదబాహుయుగంబును వెడదయురముఁ
గొమరుమీసలు దీర్ఘనేత్రములు మెఱయ
మానినీజనమానసమానహరణ
చతురతరమూర్తి యారాజసుతుఁడు మెఱసె.

8


ఉ.

ఏయు నిశాతబాణములహేళిఁ బదింబది సూక్ష్మలక్ష్యముల్
త్రోయు సుతప్రఘాణమునఁ దుంగధరాధరశృంగసంఘముల్
వేయు భుజాకృపాణి నవలీల నయోమయపిండఖండముల్
ప్రాయము పెక్కువన్ ధరణిపాలతనూజుఁడు సత్త్వయుక్తుఁడై.

9


గీ.

ఇత్తెఱంగున యౌవనాయత్తుఁ డగుచు
దండ్రియానతి యొక్కింత తప్ప వెఱచి