పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పడుతున్నారు. తమకు చేతనైనంత కృషి సల్పుతున్నారు.

ఆకలైనప్పడు పిల్లలు అమ్మను అన్నమడుగుతారు. అలానే తన శక్తికి మించినపనులు ఎదురైనప్పడు తెలుగు భాషకు తల్లియైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సహాయపడమని విన్నవించుకుంటారు విదేశప్రవాస ఆంధ్రులు. ఇటువంటి క్లిష్ట సమస్య ఏర్పడిన దక్షిణాఫ్రికా ఆంధ్రులు, తమ మాతృ భాషను కాపాడుకోడానికి సహాయపడమని ఎంతో వినయ విధేయతలతో కోరడం గ్రంథకర్త చాలా చక్కగా వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు తోడుగా, తోడు నీడగా ఉంటుందని కలలు కంటూ యుంటారు ఈ పిచ్చి విదేశ, ప్రవాస ఆంధ్రులు. అవి పగటి కలలైతే బిక్కమొుగం పెట్టడం తప్ప మరేం చేయగలరు?

"మారిషస్‌లో తెలుగు తేజం అన్న ఈ గ్రంథంలో చిరంజీవి మండలి బుద్ధ ప్రసాద్ గారు 1975, 1981, 1990వ సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్, మలేషియా, మారిషస్ దేశాలలో జరిగిన మూడు ప్రపంచ తెలుగు మహాసభలను గూర్చి చక్కగా వివరించారు. చివరిగా జరిగిన మూడవ ప్రపంచ తెలుగు మహాసభల తీర్మానాలకు స్పష్టమైన, చక్కని లిఖిత రూపకల్పన చేశారు. ఇదివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమో, ప్రపంచ తెలుగు భాష అభ్యుదయానికి "సేవ చేయటానికై ప్రత్యేకముగా స్థాపించిన అంతర్జాతీయ తెలుగు సంస్థయో చేయని ఒక మహత్తర కార్యాన్ని చేసి ఈ గ్రంథం ద్వారా ప్రపంచ తెలుగు జాతికి వెలుగు చూపిన ప్రజ్ఞాశాలియైన ఆంధ్రప్రదేశ్ యువ ప్రజానాయకుడు శ్రీ మండలి బుద్ధప్రసాద్‌గారిని "శభాష్ వీరాంధ్ర సోదరా" యని పొగుడుతున్నాము.

తెలుగు తల్లి ఈ తెలుగు తనయుని ఆశీర్వదించుగాక!

ఇట్లు

మదిని సోమనాయుడు

మలేసియా ఆంధ్ర సంఘ వ్యవస్థాపకుడు మరియు

ద్వితీయ ప్రపంచ తెలుగు మహాసభల ప్రధాన కార్యదర్శి

మలేసియా