పుట:భాస్కరరామాయణము.pdf/438

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మును మిడి రజనీచరవా, హినిఁ గూల్చుచు నున్యన్నరేంద్రులఁ గనియెన్.

544


క.

కని మాయావిద్యాబల, మున నీరంధ్రముగ మేఘములు నీహారం
బు నొనర్చి మున్ను గవిసిన, పెనుఁజీఁకటి దళము సేసి భీకరలీలన్.

545


స్రగ్ధర.

కల్పాంతామోఘమేఘాక్రమణ మలవడన్ గాఢనిర్ఘాతభీతిం
గల్పింపం జాలుకీలోద్గమబహుళకనత్కాండముల్ భూరిభూభృ
త్కల్పాకారంబు లారం గడఁగుకపివరుల్ క్రందుగాఁ గూల శౌర్యా
కల్పుల్ సుగ్రీవముఖ్యుల్ కరవిగతభుజాగర్వు లై యుండ నేసెన్.

546


క.

ఏసి నిశాతశరంబులఁ, గౌసల్యాతనయు నొంచి కవచం బఱువుల్
సేసి గవాక్షితవక్షుం, జేసెఁ దదనుజుం బ్లవంగసేన దలంకన్.

547


తే.

అప్పు డారాఘవులు ననేకాశుగములు, వింట నందంద పెనుమంట లంట నిండు
తెగలు గావించి నిగిడింప నిగిడి మగిడె, నమ్మహాబలుఁ డున్నచో టందలేక.

548


ఉ.

వెండియుఁ జండకాండములు వే కొని రావణి బాహుదండకో
దండవినిర్గతాస్త్రము లుదగ్రగతిం బఱతేరఁ దద్గరు
న్మండలజాతమారుతనినాదము నిక్కకు వేసి వానిచే
ఖండము లై కరం బరుదు గా నవియుం బడ రోషదీప్తుఁ డై.

549


శా.

ఆస్ఫోటించి తటిల్లతోల్లసదురుజ్యావల్లితో విల్లు ర
త్నస్ఫూర్తిన్ వెదచల్లఁ బెల్లు వరబాణశ్రేణు లేసెన్ వతం
సస్ఫూర్జన్నవభూరిపుంఖమణు లోఁజం జేయ రాముం డవా
ర్యస్ఫీతస్ఫుటవిస్ఫులింగవిసరవ్యాపారఘోరంబుగాన్.

550


సీ.

అమ్మహాశరములు నందంద పఱతెంచు, కాండముల్ నఱకుచు [1]గఱులు గాలి
యుల్క లై రాలఁగ నుడుమండలము దాఁకి, వంచనఁ దొలఁగురావణికిఁ దప్పి
చని మింటిమీఁదికి సకలభూతములును, భయ మందఁ దిరుగుడు వడి నిశాట
సైన్యంబుపైఁ బడి చతురంగములఁ గూల్ప, వెస హతశేషులు విఱిగి పాఱి
లంక సొచ్చిరి దానికిఁ గింక వొడమి, తఱిమి యమ్మేఘనాదుండు తఱుచుటంప
సోన గావించి వానరసేన నెల్ల, ముంచి మాయాబలంబున మించి మఱియు.

551


చ.

ఒకదెస నార్చు నవ్వుఁ జను నొక్కదెసం దనుఁ జెప్పు నప్డ యొం
డొకదెస శింజినీధ్వని మహోగ్రముగా నెసఁగించు మించు సా
యకతకు లింతలోపలన యంతల నింతలు నొక్కపెల్లుగా
నొకదెస నేయు ఘోరకులిశోద్ధతపాతము దోఁపఁ బైపయిన్.

552


వ.

అప్పుడు కవులు గల్పావసానసమయసంభూతజీమూతనిరంతరవారిధారాడంబరం
బున నంబరంబు మ్రోయం దొరఁగుశరంబులఁ గుప్పలు గొనం గూలువారును మార్గ
ణమార్గం బలక్షితం బైనఁ జేయునది లేక యొండొరుమఱుఁగున నొదుఁగువారును

  1. గరులు గాఁడి యుల్కలు