Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/427

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ణు నవలోకించిన నన్నరేంద్రున కతం డి ట్లనియె.

466


ఉ.

ఇమ్మెయి నూఱుయోజనము లీనగశృంగమున గ్రభూమియం
దిమ్ముగ విశ్వకర్మ రచియించెఁ గనత్కలధౌతహేమసా
లమ్ములఁ జిత్రగోపురములన్ మణికల్పితమందిరాధిరా
జమ్ముల వింతశిల్పముల జా నగునీనగరీలలామమున్.

467


క.

రమణీయరత్నములరుచి, నమరెడునది పంక్తికంఠునగరు నృపాలో
త్తమ యది దశయోజనవృ, త్తము వింశతియోజనాయతము నై యొప్పున్.

468


సీ.

ఉడురాజబింబంబు నుల్లసమాడెడు, ముక్తాతపత్రముల్ ముసుఁగువడఁగ
వెన్నెలఁ జల్లెడువింజామరంబులుఁ, గంకణఝంకృతుల్ గలయఁ బొలయ
గగనమణిస్ఫూర్తి గని మాఱుమండెడు, కోటీరరత్నముల్ కొమరుమిగుల
మెఱుఁగులదిక్కుల మిఱుమిట్లుగొలిపెడు, కైదువుల్ విస్ఫులింగముల నుమియ
మేచకాంబుద మెఱసంజు మెఱసినట్లు, చెందిరపుఁజాయపట్టులఁ జెలువు మించి
యుత్తరపుగోపురంబున నున్నవాఁడు, వాఁడె దశకంధరుఁడు రఘువంశవర్య.

469


ఉ.

వానరసేనఁ జూడ నదె వచ్చినవాఁ డని చెప్ప నప్డు లో
లోనన గుబ్బతిల్లుశిఖిలోపల నాజ్యము వోసినట్టు లై
భానుసుతుండు మండి గిరిపాఁ తగలన్ వెస దాఁటె మేఘసం
తానము దూల వజ్రపతనక్రియ నాదశకంఠుమీఁదికిన్.

470

సుగ్రీవరావణులమల్లయుద్ధము

ఆ.

దాఁటి యతనియురము దాఁచినమణులు న, ల్గడలఁ జెల్ల చెదరుఁ గాఁగ మకుట
పంక్తి విఱుగఁ జఱిచి పద్మభవాండంబు, సెలఁగునార్పుతోడ నిలకు నుఱికి.

471


ఉ.

లావున దుర్మదంబు వెడలన్ నిను నాఁ డటు వాలబంధనం
భావనఁ జేసి పుచ్చిన సమగ్రభుజాబలు వాలి నాసమి
త్కోవిదు నొక్కతూపునన కూల్చినరామునిబంట నేను సు
గ్రీవుఁడరా దురాత్మ రణకేళికి డిగ్గుదు గాక నావుడున్.

472


క.

కూటము లురునిర్ఘాతము, పాటున భగ్నంబు లైనపర్వతముగతిం
గోటీరరహితుఁ డగుచు ని, శాటుండును నిలకు నుఱికె నలుకం జులుకన్.

473


క.

ఉఱికి భుజాయుద్ధమునకుఁ, దఱిమినఁ గయిదువులు విడిచి దట్టించుచు బి
ట్టఱచేత నెత్తిఁ జఱిచిన, నొఱగి యెఱఁగి యతఁడు నతనియురుమస్తకముల్.

474


లయవిభాతి.

వడిఁ జఱువ నెత్తురులు వెడలి ముఖరంధ్రములఁ 6 గడలుకొన జు మ్మనుచు నొడలు వడఁగాడం
బడ కతఁడు పాదుకొని కడునలుకతో బొమలు ముడివడఁగఁ గన్గవల మిడుఁగుఱులు రాలం