పుట:భాస్కరరామాయణము.pdf/414

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శ్వేతుం డనువీరునిఁ గల, ధౌతాచలనిభుని యాతుధానకులేంద్రా.

329


చ.

ధరణితలంబు పె ల్లద్రువ దాటుచు దిక్కులు వ్రయ్య నార్చుచున్
హరు లొగి వేయిలక్షలును నన్నియె కోటులుఁ గొల్వ నట్లు భూ
ధరనిభ మైన మే నమరఁ దాల్చి వెలింగెడు వేగవంతుఁ డన్
గిరిచరవీరుఁ డర్కజునికిం జెలి యీతఁడు రాక్షసేశ్వరా.

330


చ.

కొలిచి ప్లవంగయూథములు కోటియు ముప్పదిలక్షలుం గెలం
కులఁ జెలఁగం బిశంగరుచి ఘోరపుమేను వెలుంగఁ జూడ్కి కు
జ్జ్వలుఁ డగువాఁడు రంభుఁ డనువాఁడు నిశాచరలోకనాథ ని
శ్చలమతి యేలు శైలములు సహ్యసుదర్శనకృష్ణవింధ్యముల్.

331


క.

లంకాధిప పదికోటులు, బింకపువానరులు గొలువఁ బె ల్లార్చి భుజం
బంకించునతఁడు కుముదుఁడు, సంకోచనశిఖరి నీప్రచండుం డుండున్.

332


క.

నలువదికోటులు కపివీ, రులతో శరభుఁ డనువాఁడు రోదసి పగులం
బెలుచ నదె మల్ల సఱచుచుఁ, జెలఁగెడుఁ బ్రాలేయనగము చెల్లు నితనికిన్.

333


క.

రక్షోవల్లభ యేఁబది, లక్షలు యూథపులు గొలువ లలిఁ బనసుం డన్
వృక్షచరాగ్రణి కెరలెడు, నీక్షించితె పారియాత్ర మీతం డేలున్.

334


మ.

తను శాఖామృగషష్టిలక్ష గొలువన్ ధారాధరధ్వానమో
యన గర్జిల్లెడు నల్లవాఁడె వినతుం డవ్వీరుశై లంబు మం
థనగం బంతియ సేనతోఁ గనలుచున్నాఁ డట్లు సక్రోధనుం
డనుశూరుండును వీఁడె వీఁ డునికి పర్ణాశాతటోగ్రాటవుల్.

335


ఆ.

హరులు గామరూపధరులు డెబ్బదిలక్ష, లని నజయ్యు లైనయట్టివారు
గొలువ నడుమఁ జాఁదుకొండకైవడి నున్న, కపివరేణ్యుఁ గంటె గవయుఁ డతఁడు.

336


వ.

అని పలికి మఱియు ని ట్లనియె.

337


క.

స్కంధావారము మధ్య, స్కంధంబున నున్న సకలకపినాథులఁ ద
ద్బంధురసైన్యములను దశ, కంధర పరిపాటిఁ జూపఁగం జూడు మొగిన్.

338


తే.

వృక్షపాషాణపాణు లై వేనవేలు, యూథనాథులు దనచుట్టు నుండ వాల
రోమజాలంబు బాలార్కరుచులఁ గడవ, వెలుఁగునాతఁడు హరుఁ డనువీరవరుఁడు.

339


తే.

నీలమేఘజాలంబులలీల మెఱయ
నెలుఁగు బలుమొ త్తములతోడ నెసఁగునతఁడు
ధూమ్రుఁ డిమ్మేటి నర్మదాతోయ మెలమిఁ
గ్రోలుచును ఋక్షవంత మన్కొండ నుండు.

340


ఉ.

కాటుక కొండలట్టిఘనకాయములం గలయూథపోత్తముల్
కోటులు చుట్టునుం గొలువ ఘూర్ణిలునీతఁడు జాంబవంతుఁ డ
న్పోటరి ధూమ్రుతమ్ముఁడు గనుంగొను మితఁడు వజ్రి కాజిఁ దో