పుట:భాస్కరరామాయణము.pdf/367

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నిక్కడ వచ్చినాఁడొ వధియింతము కాల్తము మొత్తిపుత్త మం
చెక్కుడుగిన్క రాత్రిచరు లిందును నందును బట్టి యీడ్చుచున్
స్రుక్కక వ్రేయుచుం బొడుచుచున్ నిరసించుచు నుండ నయ్యెడన్.

422


క.

రక్షోనాయకుఁ డుద్ధతి, వృక్షచరప్రవరు రోషవిస్ఫారితతా
మ్రాక్షులఁ బావనిఁ గిన్కన్, వీక్షించె నతండు నాత్మ విస్మితుఁ డగుచున్.

423


సీ.

తపనీయభూషణోదంచితరోచులు, సౌదామినులమాడ్కి జాల మిగుల
రమణీయతనులిప్తకరక్తచందనచర్చ, కలితసంధ్యారాగకాంతి మెఱయ
మకుటనానారత్నమణిగణదీధితుల్, పర్జన్యకార్ముకప్రభల నీన
భూరివక్షంబునఁ బొల్చుహారశ్రేణి, లలితబలాకాళిచెలువు నొలయ
భయదహుంకృతి గర్జలపగిదిఁ జెలఁగ, మేచకాభ్రంబుకైవడి మేను వెలుఁగ
దృష్టి కక్కజమారెడు తేజ మెసఁగ, వాఁడిమగఁటిమితోఁ గడువాలుమహిమ.

424


మ.

పటువిస్ఫూర్జితపంక్తిమస్తకఫణిప్రస్ఫారబాహోగ్రుఁడుం
గుటిలభ్రూకుటిభీమధూమచటులక్రూరస్ఫులింగచ్ఛటో
ద్భటరోషాగ్నిశిఖాకులేక్షణుఁడుఁ బ్రోద్దష్టప్రలంబోష్ఠవి
స్ఫుటదంష్ట్రాళికరాళవక్త్రుఁడును జక్షుర్భీకరాకారుఁడున్.

425


ఉ.

హాటకశైలశృంగసముదంచితజూటుఁడు రత్నచిత్రిత
స్ఫాటికభాసురాసనుఁడుఁ జారుదుకూలసమావృతుండు నై
జోటులు కంకణక్వణనశోభితపాణులు చేరి చామర
ల్పాటిగ వీవఁ బ్రాభవవిలాససమున్నతు లొప్ప నొప్పుచున్.

426


వ.

నానారత్నవిచిత్రితంబును గాంచనమయంబును నైనయాస్థానమండపంబునఁ
బ్రహస్తప్రముఖు లైనమంత్రులు పరివేష్టింప నమరసేవితుం డైనదేవేంద్రుని
మాడ్కి దేదీప్యమానుం డై మెఱసి యున్నలోకవిద్రావణు రావణుం జూచి
జగత్ప్రాణతనూభవుం డచ్చెరు వందుచు నంతరంగంబున.

427


క.

ఈరూపము నీఘనభుజ, సారము నీధృతియు నిట్టిసౌందర్యము వి
స్ఫారోదారగుణంబులు, నీరాక్షసవిభుని కౌర యి ట్లొప్పెడునే.

428


క.

పాతకవర్తియు రాక్షస, జాతుఁడుఁ గాకుండెనేని శక్రాదిసుర
వ్రాతంబున కధిపతి యై, యీతఁడు లోకంబు లెల్ల నేలం దగఁడే.

429


వ.

అని విచారించువృక్షచరుని రోషతామ్రాక్షుం డగుచు నిరీక్షించి రాక్షసచక్ర
వర్తి ప్రహస్తున కి ట్లనియె.

430


క.

నిను నెవ్వఁడు పుత్తెంచెను, వన మేటికిఁ బెఱికి తీవు వడి రాక్షసభం
జన మేల సేసి తెవ్వఁడ, వని యడుగుము నావుడుం బృహస్తుం డతనిన్.

431


క.

కనుఁగొని తేజము చూడఁగ, వనచరమాత్రుఁడవు గావు వచ్చినపని వం
చన సేయక భయ మందక, వినిపించిన నిన్ను వేగ విడిపింతుఁ దగన్.

432