పుట:భాస్కరరామాయణము.pdf/364

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ద్ధురనానాయుధకీలజాలములు విద్యుత్పంక్తులుం గారణాం
భారయుక్తాక్షకవారివాహము హనూమత్పర్వతేంద్రంబుపై
శరవర్షంబులు పెల్లుగాఁ గురిసె నాశాకుడ్యముల్ దూలఁగన్.

395


క.

అంత హనుమంతుఁ డెంతయు, నంతకురోషంబుతోడ నక్షునిఁ గని క
ల్పాంతఘనధ్వని నఖిలది, గంతరపూర్ణంబు గాఁగనార్చుడుఁ బెలుచన్.

396


క.

పరుషతరక్రోధంబున, నరుణాక్షుం డగుచు మారుతాత్మజు నక్షుం
దురుతృణసంవృతకూపముఁ, గర ముద్దతిఁ గరటి చేరుకకరణిం జేరన్.

397


శా.

ఆకీశప్రభుఁ డాగ్రహంబున మహోద్యద్వాయుసంరంభుఁ డై
యాకాశంబున కుద్ధతిన్ నెగయఁ గ్రవ్యాదుండుఁ దో నేఁగి నా
నాకాండావలు లేయ వానిఁ గడిమి న్వారింప వాఁ డాతతా
నేకాస్త్రంబుల నంతరిక్షము దురుత్ప్రేక్షంబుగా నేయుచున్.

398


వ.

తదీయాశుగభిన్నభుజుం డగుచు హనుమంతుం డంత సన్నద్ధశరాసనుండును
సమరోన్ముఖుండును మహారథశ్రేష్ఠుండును బలపరాక్రమదక్షుండును నగునక్షునిం
జూచి బాలుం డని తలంప రా దితనిబలపరాక్రమంబులు సురాసురులకు మనో
భయంబులు గావున వీని వేగంబ పరిమార్పవలయు నని యవక్రవిక్రమో
త్సాహంబున.

399


క.

పరుషతరహస్తతలమున, నురవడిఁ జఱవఁ దురగాక్షయుగసాయకకూ
బరములతోడను నుఱు మై, యరదము గగనమున నుండి యవనిం ద్రెళ్లెన్.

400


తే.

రక్కసుం డట్లు నుగ్గైన రథము విడిచి, ఖడ్గకోదండపాణి యై గగనమునకు
నెగసె యోగపథంబున నియతితోడ, నొడలు దిగఁద్రావి దివి కేఁగుయోగిపగిది.

401


సీ.

ఇ ట్లుగ్రుఁ డై మింటి కెగసినయక్షునిఁ, బక్షీంద్రుఁ డురగంబుఁ బట్టినట్లు
కడకాళ్లు వడిఁ బట్టి పుడమికి నేతెంచి, తొడవులు సెదరంగఁ దొడలు విఱుగ
నంగసంధులు వీడ నస్థులు నఱుముగా, భుజములు చదియంగ భూరిశిరము
పుఱియలుగా రక్తపూరముల్ గ్రక్కఁగ, వేమాఱు నేలతో వ్రేసి వ్రేసి
యంపపొదితోన నుఱుమాడి చంపి తన్ను, గరుడయక్షభూతములు నాఖండలాది
సురలు మౌనులు వెఱఁ గంది చూడ విజయ, మంది తోరణమున కేఁగె ననిలసుతుఁడు.

402


వ.

ఇ ట్లక్షుండు పొలియుట విని రావణుండు దనయంతరంగంబున దుఃఖాక్రాంతుం
డై యెంతయుం జింతించి కొంతవడికి ధైర్యం బవలంబించి కోపసంఘటితభ్రు
కుటినిటలుం డగుచు నింద్రజిత్తుం గనుంగొని.

403


క.

అస్త్రధరశ్రేష్ఠుండవు, నిస్త్రాసుఁడ వఖిలనీతినిపుణుండవు ర