పుట:భాస్కరరామాయణము.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ల్లుంఠితదోషుఁడనై వై, కుంఠమునకు నరుగువేళ గూడెన్ నాకున్.

319


సీ.

భానుజ రాజ్యంబుఁ బ్రాణము సర్వస్వ, మును డించి సురపురంబునకుఁ బోవు
చున్నాఁడఁ గపిరాజ్యకము న్నాపురశ్రీలఁ, గైకొమ్ము కామాంధకార మడర
దగవును ధర్మంబుఁ దలఁపక తమ్ముఁడ, నీ కెగ్గుఁ జేసితి నీచబుద్ధి
నాతప్పు సైరించి భ్రాతృసౌహార్దంబు, నామీఁదఁ బాటించి నడవు మింకఁ
దొరఁగు బాష్పధారల మోము దొప్పఁదోఁగ, వగలు మిగులంగ నేడ్చుచు వసుధ వ్రాలి
ధూళిధూసరగాత్రుఁ డై చాలఁ దూలి, యున్నవాఁ డంగదునిఁ గంటె యుల్ల మెరియ.

320


శా.

ఈతారాసుతుఁ డైనయంగదు సుఖాన్వీతాత్ముఁగా నీగతిం
బ్రీతిం బెంచితి నింత కాలము కడుం బెంపొందఁ బ్రాణప్రియుం
డీతం డెంతయు నాకు నర్కసుత నీ వీపట్టి నామాఱుగాఁ
జేతోదుఃఖము వాయ గారవమునం జేపట్టి రక్షింపుమీ.

321


క.

ఈతఁడు మత్సదృశబలా, న్వీతుం డీతనికి నీవ యెప్పుడు నింకన్
దాతవు నేతవును బరి, త్రాతివు యువరాజుఁ జేయు తగ నీపుత్రున్.

322


ఉ.

రాముఁడు రావణున్ గెలిచి రాజస మెప్పఁ బరాక్రమంబునన్
భూమిజఁ దోడితే నటకుఁ బోయినయప్పుడు నీవు చూడ సం
గ్రామములోన నీకుఁ గడుఁబ్రా పయి ముందట వీఁడు రాక్షస
స్తోమముఁ ద్రుంచి వైచి యతిదోర్బలసంపద వాలెడుం దగన్.

323


క.

ఈతార సుషేణుని సుత, యాతతజపశీల సువ్రతాన్విత పరఁగన్
నీతిపరురాలు గావున, నీతార సుబుద్ధి నడపు మెడపక యెపుడున్.

324


క.

రాముఁడు పంచినకార్యం, బేమఱ కటు సేయు వేగ మెంతయు వేడ్కం
దామసమునఁ దత్కార్యం, బేమఱినను నన్నుఁబోలె హింసించుఁ జుమీ.

325


వ.

అని యిట్లు పలికి రామచంద్రుం గనుంగొని

326


క.

కరములు మొగిడిచి భక్తిని, శిరమునకుం జేర్చి మ్రొక్కి సీతేశునితో
వరమతి నంగదుకొఱకుం, దరుచరపతి యైనవాలి తగ ని ట్లనియెన్.

327

వాలి యంగదుని రామున కొప్పగించి మృతుం డగుట

క.

ఘనుఁడు నుదారకులుండును, ననుపమభుజబలుఁడు నైన సతిదుఃఖము పొం
దినఁ గృపణుఁ డగుచు నుండును, జనవర యటు గాన నేను సమసినమీఁదన్.

328


క.

ఘనతరశోకముపా ల్పడి, యనిశము నాసుతుఁడు గృపణుఁ డై యుండఁగలం
డని యెంతయు శోకించెద, మనమున నిట నాదుకొఱకు మఱుఁగ నరేంద్రా.

329


క.

నానందనుఁ బ్రియమున మును, గానక మన నింకఁ బాపకర్ముఁడు దివముం
గాననివిధమున నంగదుఁ, గానక పో నకట నాకుఁ గాలం బయ్యెన్.

330