పుట:భాస్కరరామాయణము.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

తదనంతరంబ యచ్చేరువతపోవనంబుల మునిగణంబులు చనుదెంచి రామచం
ద్రు ననేకాశీర్వాదంబుల నాదరంబు లెసంగం గొనియాడి రంత లక్ష్మణుండు
జానకిం దోడ్కొని వచ్చి యారాజపరమేశ్వరుపాదంబులకుం బ్రణామంబు చేసి
సంతోషసాగరంబునం దేలె నమ్మునీంద్రు లారాజేంద్రు నభినందించుచు వీడ్కొని
నిజనివాసంబులకుం జని రవ్విభుండును బరమహర్షభరితాత్ముం డగుచు సీతాల
క్ష్మణసమేతుం డై విశాలం బగుపర్ణశాలకుం జని యం దిష్టవినోదంబుల నుండె
నంత నిఖిలరాక్షసక్షయంబునకు భయం బంది జనస్థానంబునం గలహతశేషదో
షాచరనికరంబు వికలంబై పలుదెసలకుం జనియెఁ గయ్యంబునం జావక తక్కిన
వాఁ డొక్కరుం డకంపనుం డనువాఁడు రావణుం డున్నయెడకు నతిత్వరితగతి
నరిగి యేకాంతంబున నన్నిశాచరపతిం గదిసి శంకించుచుం జెప్ప నోడినం
దలంకక కలరూ పెఱింగింపు మనిన నభయంబు వేఁడి వాఁ డిట్లనియె.

245

అకంపనుఁడు రావణునకు రామువృత్తాంతంబు చెప్పుట

చ.

దశరథరాజనందనుఁడు తమ్ముఁడు భార్యయుఁ దోడరాఁ దపో
వశగతి దండకాటవికి వచ్చి ఖరాదినిశాచరావళిన్
మశకములన్ హరించు పెనుమంటయుఁబోలె నడంచి మాఱు లే
క శరశరాసనోగ్రుఁ డయి క్రాలెడుఁ బంచవటీస్థలంబునన్.

246


మ.

అనినం గన్నుల నిప్పు లుప్పతిల రోషావేశముం బొందున
ద్దనుజేంద్రుం బ్రణుతించి చెప్పెద సమాధానంబుమైఁ గార్యముం
గనుఁగొ మ్మాహవభూమి రాముఁ జెనయంగా రాదు గల్పాంతవ
ర్తనరౌద్రోద్ధతరుద్రకోటి కయినం దథ్యంబు లంకేశ్వరా.

247


సీ.

ధరణీతలంబు పాతాళంబునకుఁ గ్రుంగ, నడువ నింగికి నెత్త నతఁడె చాలు
గ్రహతారకౌఘంబు మహిఁ గ్రందుపడ రాల్ప, నవి పొందుపడ నిల్ప నతఁడె చాలు
జలధు లన్నియుఁ బాఱఁజల్లి యింకింపంగ, నవి నిండఁ బూరింప నతఁడె చాలుఁ
ద్రిజగంబు మార్పడఁ ద్రిప్పి ముందటియట్ల, యలవడఁజేయంగ నతఁడె చాలుఁ
జండశతకోటిశతకోటిసారఘోర, నిశితనిష్ఠురశరసముల్లసితచాప
దీపితాటోపనిర్జితత్రిభువనుండు, ఘనుఁడు కాకుత్స్థతిలకుండు దనుజనాథ.

248


చ.

అతనియనుంగుఁదమ్ముఁ డసహాయపరాక్రమశాలి నిర్భరా
ద్భుతభుజసారుఁ డుగ్రవనభూముల నన్నకు భక్తి సేయుచున్
సతతముఁ దాఁ జరించు సువిచారుఁడు లక్ష్మణనామధేయుఁ డ
య్యతులబలుండు నానృపుని యట్టిఁడ సంగరరంగభూములన్.

249


ఉ.

కావున వారలం దొడరఁగాఁ దలపోయుట దుర్నయంబు నీ
కేవిధి నైన వారి సమయింపఁగ నిష్టమ యేనిఁ బూని రా
మావనినాథుభార్యఁ గుటికలాలక సీత హరింప దాన శో