పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/394

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

370

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


కాశీనాధుని నాగేశ్వరరావు, కొండా వెంకటప్పయ్యగార్లవంటి దేశనాయకులను, ఇంకను జాతీయకళ్యాణముకొరకు సర్వస్వము త్యజించి దేశముకొర కాహుతియై ధన్యులైన అసంఖ్యాకులగు అజ్ఞాతవీరులను, ఆంధ్రదేశమునకు ప్రసాదించి గాంధిమహాత్ముని స్వాతంత్ర్యయజ్ఞమునకు స్నాతకులుగ జేసినది. నాడు దేశములో నెల్లయెడల జాతీయవిద్యయు స్వదేశపరిశ్రమలు దేశాభిమానమును ప్రజ్వరిల్లెను.

V

దారుణవాదము ('టెర్రరిజం'.)

దేశములో ప్రభుత్వమువారు ప్రజాస్వాతంత్ర్యముల నణగద్రొక్కి వేయుచు తీవ్రనిర్బంధవిధానము నవలంబించుచున్న కొలది, ప్రజలలో నందుముఖ్యముగా యువకులందు రోషము హెచ్చుట సహజము. ఈ కారణమువలన దేశాభిమానము రహస్యమార్గములబట్టి పోవుచు వక్రగతిని నడువసాగెను. వంగరాష్ట్రమున కొందఱు యువకులు ఈ పరాయి ప్రభుత్వము నేవిధముగానైనను తిరుగదోడవలెనని నిశ్చయించుకొని అందుకొఱకు రహస్యసంఘములు స్థాపించి దేశముకొఱకు ప్రాణము లర్పించుటకు కాళికాశక్తియెదుట ప్రమాణములు జేసి కార్యదీక్షతో పనిచేసిరి. ఐరోపాలో పరాసుదేశమునను, అమెరికాలోను, జరిగిన స్వాతంత్ర్యయుద్ధములను రష్యాలోను ఇతరచోట్లను అచ్చటి నిరంకుశ ప్రభుత్వములను తిరుగదోడుట