తే. |
బొంది యేలోకముననైనఁ బూజ్యు లగుచు
నిత్యముక్తులు సుఖులునై నెగడుచుందు
రిట్టి మాఘంబుమహిమ నీ కధికభక్తి
నెఱుఁగ జెప్పెద వినుము నా యెఱిఁగినంత.
| 135
|
వ. |
తత్ప్రభావప్రకారంబగు నొక్కయితిహాసంబు గలదు తత్పర
చిత్తుండవై వినుమని యిట్లనియె.
| 134
|
వసిష్ఠుఁడు దిలీపునకుఁ జెప్పిన భృగుమహర్షి వృత్తాంతము :
సీ. |
తొల్లి పండ్రెండేండ్లు దురితకారణమున
వానలు లేకుండ వసుధకెల్ల
దుర్భిక్ష మరుదేర దురపిల్లి ప్రజలెల్ల
నశనకాంక్షల డస్సి యనువు దప్పి
హిమశైలసహ్యమధ్యమదేశమంతయుఁ
బాడఱి పితృదేవబలివిధాన
హవ్యకవ్యములకు నన్నంబు ఫలమూల
ములు లేక క్రియలెల్లఁ బొలిసిపోయె
|
|
తే. |
నగ్నిహోత్రము లన్నియు నణఁగిపోయె
సకలవర్ణాశ్రమంబుల జాడ లుడిగెఁ
జోరబాధలు తఱుచయ్యె సుజనశీల
మవశమై పోయె నయ్యుపప్లవము వలన.
| 135
|
తే. గీ. |
వింధ్యపాదాశ్రయమున నవంధ్యనియతి
నుండి భృగు వట్టికఱవున కోర్వలేక
శిష్యగణములతో హిమశిఖరి దాఁటి
దివ్యనదులును గిరులు నతిక్రమించి.
| 137
|