పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-ప్రథమాశ్వాసము

29


తే.

బొంది యేలోకముననైనఁ బూజ్యు లగుచు
నిత్యముక్తులు సుఖులునై నెగడుచుందు
రిట్టి మాఘంబుమహిమ నీ కధికభక్తి
నెఱుఁగ జెప్పెద వినుము నా యెఱిఁగినంత.

135


వ.

తత్ప్రభావప్రకారంబగు నొక్కయితిహాసంబు గలదు తత్పర
చిత్తుండవై వినుమని యిట్లనియె.

134

వసిష్ఠుఁడు దిలీపునకుఁ జెప్పిన భృగుమహర్షి వృత్తాంతము :

సీ.

తొల్లి పండ్రెండేండ్లు దురితకారణమున
        వానలు లేకుండ వసుధకెల్ల
దుర్భిక్ష మరుదేర దురపిల్లి ప్రజలెల్ల
        నశనకాంక్షల డస్సి యనువు దప్పి
హిమశైలసహ్యమధ్యమదేశమంతయుఁ
        బాడఱి పితృదేవబలివిధాన
హవ్యకవ్యములకు నన్నంబు ఫలమూల
        ములు లేక క్రియలెల్లఁ బొలిసిపోయె


తే.

నగ్నిహోత్రము లన్నియు నణఁగిపోయె
సకలవర్ణాశ్రమంబుల జాడ లుడిగెఁ
జోరబాధలు తఱుచయ్యె సుజనశీల
మవశమై పోయె నయ్యుపప్లవము వలన.

135


వ.

అంత.

136


తే. గీ.

వింధ్యపాదాశ్రయమున నవంధ్యనియతి
నుండి భృగు వట్టికఱవున కోర్వలేక
శిష్యగణములతో హిమశిఖరి దాఁటి
దివ్యనదులును గిరులు నతిక్రమించి.

137