పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/576

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

278

పద్మపురాణము


ఆ.

ప్రాభవమున నిప్పురాణార్థ మంతయుఁ
దెలిసి విష్ణుపూజ తివిరిసేయు
నిదియె నీకు మోక్ష మీ నోపు గతి యని
చెప్పె నమ్మునీంద్రశేఖరుండు.

138


వ.

ఇట్టి పురాణం బాద్యంతంబుగ విని దిలీపభూపాలుండు నిజకుల
గురుండగు వసిష్ఠమహామునీంద్రునకుఁ బునఃపునఃప్రణామంబు
లాచరించి యనేకవస్త్రాభరణమాల్యంబులం బూజించి వీడ్కొలు
పుటయు నమ్మునికుంజరుండు నిజాశ్రమంబునకుం జని సుఖం
బుండె నమ్మానవేశ్వరుండు నిత్యనైమిత్తికవిధానంబున విష్ణు
నారాధించుచు ననేకసహస్రవర్షంబులు రాజ్యంబు చేసి పదంపది
పరమయోగీంద్రగమ్యం బగు పరమపదంబున విష్ణుసారూప్యంబు
పడసి నిత్యముక్తుం డయ్యెనని చెప్పి సూతుండు [1]వెండియు
నిట్లనియె.

139


క.

ఇది సర్వవేదసారం
బిది సకలసురైకసేవ్య మిది పురుషార్థం
బిది హరిభక్తిసుఖాస్పద
మిది మోక్షప్రదము నగు మునీశ్వరులారా!

140


తే.

అఖిలజగములు సుఖలీలలందుఁ గాత
పరహితోపకారమ్ముగఁ బరఁగుఁ గాత
దోషసంఘము శాంతమై దూలుఁ గాత
మనుజు లందఱు సుఖమొంది నుండ్రు గాత.

141


క.

అని యిప్పురాణకథనం
బనుపమమతియైన రోమహర్షణసుతుఁ డిం
పొనర వినిపించుటయు విని
యనఘాత్ములు శౌనకాదు లతిహర్షమునన్.

142
  1. శౌనకాదులకు వెండియు (హై)