పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-పంచమాశ్వాసము

195


క.

ఏ యాశ్రమస్థుఁ డైనను
బాయక విప్రుండు విష్ణుపరుఁడై చక్రాం
కాయతనభుజుఁడుగాఁ దగు
నీ యర్థము [1]శ్రుతులు చెప్పు నిందునిభాస్యా!

70


వ.

అని యిట్లు మహోపనిషత్తులందు బ్రాహ్మణునకు శంఖచక్రంబులు
దక్షిణసవ్యభుజంబుల ధరియించుట యవశ్యకర్తవ్యంబని చెప్పం
బడు ఋగ్యజుస్సామవేదంబుల యం దిట్లయని చెప్పంబడు నట్లు
గావున.

71


ఆ.

విష్ణుభక్తులందు వెలయు వారలు శంఖ
చక్రములు ధరించి సౌమ్యు లగుదు
రట్లు లేమి నందకాదులు ధరియింతు
రఘభవాంబురాసు లణఁపఁగోరి.

72


వ.

అందు చరణంబు పవిత్రంబు వితతంబు పురాణంబు శుభంబు
బ్రాహ్మ్యంబు ప్రాజాపత్యంబు వాఙ్మయంబు జగత్పూజ్యంబు
నేమి యరిచక్రంబు సుదర్శనంబు సహస్రారంబు ప్రాకృత
ఘ్నంబు లోకద్వారంబు మహౌజసం బనం బర్యాయనామంబులు
గలుగు చక్రంబు దప్తంబు చేసి ధరియించునట్టి పుణ్యాత్ములు
ఘోరాఘపారావారోత్తరణంబు చేసి విష్ణుపదప్రాప్తు లగుదు రట్లు
గావున బ్రహ్మాదిదేవతలకును సుదర్శనధారణంబు పరమధర్మం
బని చెప్పంబడును. పురాణేతిహాసంబులు నిట్లని చెప్పు మఱియును.

73


మత్త.

ఫాలపట్టిక నూర్థ్వపుండ్రము బాహుమూలయుగంబునం
దోలిఁ జక్రము శంఖముం జెలువొందఁగా ధరియించుచున్
లోలురై హరిమంత్రము న్మదిలో జపించుచు నిత్యు లౌ
వారె విష్ణుపదంబుఁ జెందెడువారు వైష్ణవు లద్రిజా!

74
  1. శ్రుతులఁ జెప్ప (ము)