పుట:పంచతంత్రి (భానుకవి).pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యట్లు బోయ కుడిచి కమఠంబును ధనువుకొప్పునఁ దగిలించికొని చనుచుండ
నమ్మూవురును లుబ్ధకప్రతిబంధంబులువోలె వెసఁదగిలి చనుచుండ నతం
డొక్కజలాశయంబు గనుంగొని యందు మధురంబులగు జలమ్ములు
ద్రావుచున్న సమయంబున,

104


చ.

త్వరితగతి న్మొగమ్ము తనుఁ దాఁకుచుఁ బారిన లేడిఁ గాలకిం
కరనిభమూర్తి లుబ్ధకుఁడు గాంచి పరాకుగ భేదితాంగదు
ష్కరతరపీడఁ జిక్కెనని సంభ్రమియై వెనువెంట నేఁగ నా
తురరుతముల్ చెలంగ నది దూరమునన్ బడియె న్మహీస్థలిన్.

105


వ.

అంతలోన.

106


శా.

కాకం బుద్ధతి నేఁగి చంచువులఁ దత్కాయంబు భేదించిన
ట్లాకాలమ్మునఁ జేసి లుబ్ధకుఁడు వాంఛాపూర్ణచేతస్కుఁడై
నాకుం జిక్కెనటంచు డగ్గఱిన యంతన్, బోయె నారెండు న
స్తోకాహ్లాదముతో నతండు మిగులం దుఃఖాంబుధిం దేలుచున్.

107


వ.

మగుడి చనుదెంచి నంత నమ్మూషికవిభుండు తనతీక్ష్ణరదనాగ్రం
బుల జాలంబు తుత్తునియలు గావించి సంభ్రమంబున నొక్కరంధ్రాంతరా
ళమ్మునకుం జనె నాసమయమ్మున,—

108


క.

రయమునఁ గచ్ఛపము జలా
శయమునకుం బోయె బోయ చనుదెంచి విషా
దయుతుండై మగిడి నిజా
లయమునకుం ౙనె వివర్ణ[ల]పనుం డగుచున్.

109


వ.

ఇట్లు శబరపుంగవు నోట్రించి కాకహరిణమూషికంబులు నిజ
సఖుండగు కచ్ఛపేశ్వరుని విడిపించుకొని సంతోషాతిశయంబునఁ గ్రమ్మఱ
లఘుపతనకహిరణ్యకమంథరహరిణపతులు గూడికొని తమతమయథా
స్ధానంబులకుం జని సుఖపరాయణులై యుండిరని విష్ణుశర్మ రాకుమారులఁ
బ్రహృష్టహృదయులం జేసె నంత,

110


శా.

పారావారగభీర! విభ్రమవతీపాంచాల! కారుణ్యవి
స్తారోదారకటాక్షవీక్షణ! సుధాంధస్సింధుతారాగస