పుట:పంచతంత్రి (భానుకవి).pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

ఘనతరోపాయ మొక్కటిఁ గాంచి, బుద్ధి
నలరువానికిఁ, గానికార్యములు గలవె!
యనుచు సంతోషచిత్తుఁడై యచ్చటికిని
దడసిపోయినఁ గోపించి తన్ను జూచి.

171


మత్తకోకిల.

లంబకర్ణ! మహాక్షుథం బడలంగఁ జేసితివన్న సిం
హంబుతోనను నన్యకేసరి యామిషాభిరతిన్ బ్రమో
దంబు నొంది గ్రహింప వచ్చినఁ దల్లడించి యరణ్యభా
గంబునంబడి పారివచ్చితిఁ గల్లకాదని పల్కినన్.

172


వ.

సింహంబు కుందేలున కిట్లనియె.

173


గీ.

నాకుఁ జూపఁగలవ! యాకేసరిప్రభు
ననినఁ బదమటంచుఁ నధికనిమ్న
కూపతీరమునకుఁ గొనిపోయి, వీఁడె యు
న్నాఁడు చూడుమనుచు వాఁడు పలుక.

174


వ.

మృగేంద్రుండును జలాంతరమ్మునఁ బ్రతిబింబితంబగు కంఠీర
వంబు గనుంగొని కోపించి హుంకరిపుచు దుర్మదంబున నానూఁతంబడ
నుఱికి మృతింబొందె, నప్పుడా శశకంబు నిఖిలమృగస్తోత్రపాత్రంబయి
చరియించె నట్లు గావున కుశలబుద్ధి వలయుననిన విని కరటకుం డట్లేని భేద
కార్యంబున నన్యోన్యవివాదం బాపాదించి తగు నుపాయంబునం బ్రవర్తిం
పుము రాజసన్నిధి నీకు భద్రంబగు గాక పొమ్మని యనిపిన మహాప్రసాదం
బని దమనకుం డచ్చోటువాసి పింగళకు సమీపంబునకుం జని యిట్లనియె.

175


గీ.

అధిప వీక్షింపు డిదె ప్రళయంబు వచ్చె
భూమిఁ దనవిభు నాపద పొందుచోటఁ
దెలుపకుండిన భటుఁ జెందుఁ గలుష మనుచుఁ
జేరి హితవాచరింప వచ్చితినటన్న.

176


ఉ.

పింగళకుండు వానిఁ గడుప్రేమముతోడుతఁ జెప్పుమన్నఁ జె
ప్పంగఁ దొడంగె, నుక్షపతి పాపమతిన్ భవదీయశక్తి నా
ముంగల కొద్దిచేసి యనుమోదవశంబున రాజ్యమెల్ల నే
లంగలవాఁడ నంచు దనలావు మదమ్మున నున్నవాఁ డనెన్.

177