పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/675

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


నందునైన యజ్ఞత; యౌవనంబున నగుసుఖం బెఱింగించెద వినుండు,
పంచశరుండును బంచేంద్రియంబులు బాధింప నతిదుర్లభంబులైన
యవి యాత్మం గోరుచు నర్థంబువలన, భార్యాదులవలనఁ బరితోషంబు
నొందుచు, నిజదారధనాదులం బరితుష్టి నొందిన, విభవంబుల సుఖం
బనుభవింపఁడు; విభవంబులన్నియు ననిత్యంబు; లీవిభవంబులు
చనిన గోటిగుణితంబగు దుఃఖంబు ప్రాపించు; దారపుత్రధనంబుల
యందు నెవ్వండు లోలుండగు నదియ దుఃఖంబు; తద్దుఃఖమహా
తరువులకు బీజంబులు హృదయంబున నాటిన నవి కాలంబునందుం
దనువు భేదించి మొలక లెత్తుపర్యంతమును దుఃఖాన్వితులగు ధన
దారపుత్రుల నాత్మజ్ఞుండు గానివాఁడు పరిగ్రహించి గ్రీడించు;
నమంత్రజ్ఞుఁడు వ్యాళ శిశువులం బట్టినతెఱంగున, జీర్ణంబైన నావ
మహాబ్ధి నాశ్రయించినయట్లు, విచ్ఛిద్యమానమాహోన్నతశాఖి శాఖ
నెక్కినమాడ్కిఁ గేవల నశ్వరంబులగు విషయంబులు భజియించి,
దుఃఖంబు లనుభవించుం గాన, నీయౌవనంబున నేని సుఖంబు లేదు;
వార్థకంబున దుఃఖం బేమి సెప్పుదు? నాది వ్యాధి మహానదులకు
నర్ణవం బగు; ఇంతియ కాదు; సర్వావస్థలయందును సుఖంబు లేదు;
మఱియును,

169


ఉ.

పుత్రులు లేకయున్నయెడ పూర్ణతరోత్కటఘోరదుఃఖముల్
పుత్రులు గల్గి సద్గుణవిభూతి వహింపకయున్న దుఃఖముల్
పుత్రు లకాలధర్మమును బొందిన యట్టి యవాచ్యదుఃఖముల్
పుత్రులు గల్గినంతనె యపూర్వసుఖంబులఁ బొందనేర్చునే.

170


క.

దారసుతబంధుమిత్రా
పారమహాసంపదలును బహుదుఃఖముల్
తారాధిపమధుమందస
మీరాదులు విరహిజనుల నేఁచు తెఱఁగునన్.

171


క.

చొప్పడ నెన్నివిధంబులఁ
దప్పదు మది మృత్యుభీతి; దాన సుఖంబే?
యెప్పుడొ యెవ్వనిచేతనొ
యిప్పుడొ యీవెనుకనో మహీవలయమునన్.

172